Publish Date:May 23, 2024
ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి వేవ్ లేదని రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర శర్మ అభిప్రాయపడ్డారు. ఈ వేవ్ లెస్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేనలను ఎన్డీయేలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీ బోలెడంత రాజకీయ లబ్ధి పొందిందని ఆయన అన్నారు.
Publish Date:May 23, 2024
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని కేంద్రం సైతం అంగీకరించింది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. ఈ మార్పులతో తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారు
Publish Date:May 23, 2024
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. అరాచకాలు, అకృత్యాలు, దాడులు, ఈవీఎంల విధ్వంసం ఇలా ఆయన చేయని దారుణం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Publish Date:May 23, 2024
చైనా భారత్ సరిహద్దు వివాదం చాలాకాలంగా నలుగుతూనే ఉంది. అయితే డ్రాగన్ దేశం భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది. తాజాగా చైనా భారత్ మీద మరో అఘాయిత్యానికి పాల్పడింది. భారత పౌరుల చేత భారత్ మీదే సైబర్ నేరాలకు పాల్పడాలన్న చైనా కుట్ర భగ్నమైంది.
Publish Date:May 23, 2024
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4న జరుగుతుంది. అయితే ఇప్పటికే కూటమి గెలుపుపై సర్వత్రా ఒక నమ్మకం అయితే ఏర్పడిపోయింది. అధికారికంగా ఫలితం వెలువడే వరకూ ఒకింత ఉత్కంఠ తప్పదు. కానీ గెలుపు గుర్రాలు ఏవీ, పరాజయం పాలై పలాయనం చిత్తగించేది ఎవరు అన్న విషయంలో రాష్ట్రంలో ఎన్నికలపై జరుగుతున్న బెట్టింగులను బట్టి సులువుగానే అర్ధం అవుతున్నది.
Publish Date:May 23, 2024
పెద్దలు సాధారణంగా నాలుగు రాళ్ళు వెనకేసుకోమంటారు. కానీ చాలామంది కడుపులో రాళ్ళు పెంచుకుంటున్నారు
Publish Date:May 23, 2024
జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంటే నేషనల్ డెమక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఎ). ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్’పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎకు ఇప్పుడు మోడీ పదేళ్ల పాలనలో ఎన్డీయేకూ అసలు పోలికే లేదు. ఇప్పుడు ఎన్డీయేలో సింగిల్ సీట్ పార్టీలు తప్ప మరేమీ మిగలలేదు. తాజాగా ఎన్నికల ముందు కూటమిలో చేరిన తెలుగుదేశం, జనసేన వినా ప్రస్తుతం ఎన్డీయేలో చెప్పుకోదగ్గ పార్టీ లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
Publish Date:May 23, 2024
ఏపీలో వైసీపీ నేతల రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును అడ్డుపెట్టుకోవటం వారికి అలవాటుగా మారింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా ఇదే పని చేశారు.
Publish Date:May 22, 2024
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. నియోజకవర్గ పరిధిలోని తంబిగాని పల్లెలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డాయి.
Publish Date:May 22, 2024
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
Publish Date:May 22, 2024
మాచర్ల నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. నియోకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో పోలింగ్ రోజు నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు, వారి అనుచరులు ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడి భయ బ్రాంతులకు గురిచేశారు.
Publish Date:May 22, 2024
పిరికి పిల్లి పిన్నెల్లి చేసిన పాపాలకు కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. ఆయన రాక కోసం సెంట్రల్ జైలు గేటు ఎదురుచూస్తోంది.
Publish Date:May 22, 2024
మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్కు కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం పంపించారు.