నాగబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్.. ఎందుకంటే?

Publish Date:Feb 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ సుప్రీంలో చార్జిషీట్ దాఖలు చేసిన క్షణం నుంచీ ఏపీ రాజకీయం రగులుతోంది. చార్జిషీట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నిర్ధారించిందని వైసీపీ అంటుంటే.. తెలుగుదేశం సిట్ చార్జిషీట్ అసలది నెయ్యే కాదని తేల్చిందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ తన విమర్శల దాడి పెంచి.. అధికార కూటమిని రెచ్చగొట్టి లబ్థి పొందాలని చూస్తోంది. అందులో భాగంగానే.. నెయ్యి కల్తీ వ్యవహారంలో  దూకుడుగా విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని వైసీపీ విరుచుకుపడుతోంది. పాప ప్రక్షాలన, పరిహారం అంటూ ఆలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టింది. 

ఈ నేపథ్యంలోనే జనసేనాని సోమవారం (ఫిబ్రవరి 1) పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ ఒకింత అసహనం, మరింత ఆవేశం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ప్రభుత్వ గళాన్ని వినిపిం చడంలో జనసేన నేతలు ఉదాశీనంగా వ్యవహరించడంపై మండి పడ్డారు. ఎవరి పేరూ ఎత్తకపోయినా, ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన తన సోదరుడు నాగబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని అర్ధమౌతోంని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర రెండేళ్లు కావస్తున్నది. ఈ రెండేళ్ల కాలంలోనూ ప్రభుత్వ పరంగా ఎలాంటి అరమరికలూ లేకుండా మూడు పార్టీల నేతల మధ్యా సమన్వయం ఉందన్న విషయం అవగతమౌతున్నది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం మూడు పార్టీలూ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి.  రాష్ట్రంలోపెద్దగా సొంత బలం లేని బీజేపీని పక్కన పెడితే.. ప్రధానంగా తెలుగుదేశం, జనసేనల మధ్య క్షేత్రస్థాయిలో అంతగా సమన్వయం కనిపించడం లేదు. ఆ విషయం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసుకు సంబంధించి వైసీపీ విమర్శలకు దీటుగా బదులిచ్చే విషయంలో ప్రస్ఫుటంగా బహిర్గతమైంది. అంతకు ముందు కూడా పిఠాపురం వర్మ వ్యవహారంలోనూ తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు, సమన్వయ లేమి బయటపడింది. అప్పట్లో అంటే వర్మ వ్యవహారంలో ఇరు పార్టీల మధ్యా పొరపొచ్చాలకు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తీరు కారణమన్న విమర్శలు వినవచ్చాయి.

ఇక ప్రస్తుతానికి వస్తే.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి వైసీపీ వ్యాఖ్యలు, విమర్శలకు సమాధానం చెప్పుకోవలసింది తెలుగుదేశం పార్టీయే అన్నట్లుగా జనసేన నేతలు వ్యవహరిస్తూ వచ్చారు. ఒక్క పవన్ కల్యాణ్ వినా మరెవరూ ఈ విషయంలో మాట్లాడకపోవడంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఏ విషయంలోనైనా సరే మూడు పార్టీల గొంతూ ఒక్కటిగానే ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు, ఎంపీలకు విస్పష్టంగా చెప్పారు. ఆ సమయంలోనే ఆయన ఆడవారి దుస్తుల వ్యవహారంలో మాట్లాడడానికి కావలసినంత సమయం ఉంటుంది కానీ, పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై స్పందించడానికి తీరిక ఉండదా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. సరిగ్గా ఇదే ఆయన ఆగ్రహం నాగబాబుపైనా అన్నచర్చకు తెర లేచింది. 

తిరుమలలడ్డూ తయారీకి వినియోగించిన  నెయ్యిలో కల్తీ వివాదం ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. ఈ విషయంపై నడుస్తున్న రాజకీయ వివాదంపై ప్రభుత్వం వాయిస్ ను జనసేన నాయకులూ వినిపించి తీరాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.  కూటమి పరంగా మూడు పార్టీలు అటాక్ చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. చూడాలి మరి జనసేనాని ఆదేశాలతోనైనా జనసేన నేతలు తమ వాణిని బలంగా వినిపిస్తారేమో.

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.