జనసేన రాకతో రాజకీయ కలకలం

Publish Date:Mar 15, 2014

Advertisement

 

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేన రాకతో రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ ఒక కుదుపు వచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల తనకున్న అసహ్యాన్ని ఏమాత్రం దాచుకొనే ప్రయత్నం చేయలేదు. దానిని తరిమికొట్టడమే తన లక్ష్యమని ప్రకటించేశారు గనుక ఇక నేటి నుండి కాంగ్రెస్ నేతలందరూ తమ విభేదాలను పక్కన బెట్టి మరీ ఆయనపై విమర్శల వర్షం కురిపించడం ఖాయం. ఇక, బీజేపీకి తాను దూరంగా ఉంటానని స్పష్టంగా చెప్పకపోయినా ఆయన మాటలని బట్టి ఆయన దూరంగానే ఉంటారని అర్ధమవుతోంది. కానీ ఆయన తెదేపాతో పొత్తులకు సిద్దమన్నట్లు సూచించారు గనుక, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆయన, తమను వ్యతిరేఖిస్తున్నట్లు విస్పష్టంగా ప్రకటన చేసే వరకు కూడా ఆయనను తమ మిత్రుడుగానే భావించవచ్చును. ఈ కారణంగా వైకాపా, జై సమైక్యాంధ్ర పార్టీలు కూడా ఆయనను తమ శత్రువులాగే భావిస్తాయి. అదేవిధంగా ఆయన తెలంగాణాలో కూడా తన పార్టీని నిర్మించి అక్కడ కూడా పోటీ చేసేందుకు సిద్దపడున్నందున తెరాస కూడా ఆయనపై యుద్ధం ప్రకటించడం ఖాయమే. బహుశః ఈ పాటికే తెరాస నేతలు యుద్ధం ప్రకటించి ఉండవచ్చును. అయితే, ఒకవేళ ఆయన బీజేపీకి ఏ మాత్రం సానుకూలంగా ప్రకటన చేసినా బీజేపీ ఆయన రాకను స్వాగతించే అవకాశం ఉంది. పవన్, చంద్రబాబు, నరేంద్ర మోడీ ముగ్గురు చేతులు కలిపినట్లయితే, సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో కూడా ఒక బలీయమయిన శక్తిగా అవతరించగలరు.

 

పవన్ కళ్యాణ్ కాపుల మద్దతు కోసం తాను తహతహ లాడటం లేదని చెప్పినప్పటికీ, ఒకవేళ ఆయన తెదేపాతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, ఆ పార్టీకే మద్దతు ఇస్తామని చెపుతున్న కాపు సామాజిక వర్గం నేతలు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకే మద్దతు ఈయవచ్చును. అయితే పవన్ కళ్యాణ్ జంపింగ్ జిలానీలను, రాజకీయ బఫూన్లను తాను వ్యతిరేఖిస్తున్నాని, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే రాజకీయాలలోకి వస్తున్నానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పినందున, అటువంటి వారితోనే పూర్తిగా నిండిపోయున్న తెలుగుదేశం పార్టీతో ఆయన ఏవిధంగా పొత్తులు పెట్టుకోగలరో వేచి చూడాలి.

 

రాష్ట్ర విభజనకు కారణమయిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కండువాలు, జెండాలు, టోపీలు మార్చేసి సరికొత్త వేషాలతో ప్రజల ముందుకు వస్తున్న సంగతి పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు. మరి అటువంటి వారిని ఓడించాలని భావిస్తున్న ఆయన తెదేపాతో సహా కిరణ్, జగన్ పార్టీలలో ఉన్న కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొంటే, అన్ని పార్టీలతో ఆయన ఒకేసారి యుద్ధం చేయవలసి ఉంటుంది. అయితే ఆయన తను పదవుల కోసమో అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని స్పష్టం చేస్తున్నందున, ఆయన అందుకు వెనుకాడకపోవచ్చును. అదే జరిగితే కాంగ్రెస్ నేతలు ఏ కండువా కప్పుకొని పోటీ చేసినా వారికి పవన గండం తప్పదని చెప్పవచ్చును.

 

అయితే పవన్ కళ్యాణ్ ఈ వేడిని ఎంతకాలం నిలుపుకోగలడనే దానిపైనే ఆయన పార్టీ భవిష్యత్త్ మరియు ఇతర పార్టీలపై ఆయన ప్రభావం కూడా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అతను ఎంత త్వరగా, ఎంత సమర్ధంగా, బలంగా తన పార్టీని నిర్మించుకోగలడనే దానిపైన పవన్ కళ్యాణ్, జనసేనల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

By
en-us Political News

  
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.