అదే రిపీటవ్వుద్ది.. అయ్యింది
Publish Date:Mar 2, 2014
Advertisement
తనకు ఇష్టం లేని పని చేస్తే .. 'మళ్లీ ఇదే రిపీట్ అవ్వుద్ది' అంటూ బద్రీ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ కొడతాడు. నిజంగానే మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది, అయ్యింది కూడా. మెగా ఫ్యామిలీ అనేది ఓ పెద్ద కోట అనుకుంటే, ఆ కోటకు నెమ్మదిగా బీటలు వారుతున్నాయన్న వాదనలకు వరుణ్ తేజ్ కొత్త సినిమా లాంచింగ్ కార్యక్రమం మరింత బలాన్నిచ్చింది. ఇంతకుముందు రాంచరణ్ తేజ్ నటించిన రచ్చ సినిమా ఆడియో ఫంక్షన్ మొత్తమ్మీద ఎక్కడా పవన్ కనిపించలేదు. ఇక నాగేంద్రబాబు కుమారుడు వరుణ్ తేజ్ సినిమా లాంచింగ్ కార్యక్రమానికి పవన్ వచ్చాడన్న మాటే గానీ, ఎందుకొచ్చిందిరా భగవంతుడా అన్నట్లుగా మెట్ల మీద ఒక రకమైన ఫోజు పెట్టుకుని కూర్చున్నాడు. పవన్ వచ్చేటప్పుడు చాలా సందడి కనిపించినా, ఆ తర్వాత చిరంజీవి ఉండగా మాత్రం ఆ సందడి ఎక్కడా కనిపించనే లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలకు కారణం ఏంటనే ప్రశ్నకు అనేక సమాధానాలు ఉంటాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ నాయకులను పరోక్షంగా ఉద్దేశించి.. వాళ్ల పంచెలూడదీసి కొట్టండి అంటూ పవన్ ఆవేశంగా మాట్లాడాడు. ఆ ప్రసంగాలలో వాడి, వేడి పార్టీ కొంతయినా బతికి బట్టకట్టడానికి ఉపయోగపడిందని అంటారు. కానీ అలాంటిది.. తర్వాతి కాలంలో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయంలోనే సోదరులిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. ఇక ఆరెంజ్ సినిమా తీసిన తర్వాత నాగేంద్రబాబు ఎంత అప్పుల్లో కూరుకుపోయాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ సమయంలో దాదాపుగా ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని నాగబాబు బాధపడుతుంటే, ఎక్కడో విదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ముందుగా ఫోన్ చేసి, అన్నయ్యా.. నువ్వు కంగారు పడకు, నేనున్నాను. రాగానే అన్నీ చూసుకుంటా అని చెప్పి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవి మాత్రం తన కొడుకు సినిమాయే అయినా.. దాని విషయంలో పెద్దగా పట్టించుకోలేదని.. తాపీగా కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి పర్వాలేదుగా, అంతా బాగానే ఉందిగా అంటూ పొడిపొడిగా మాట్లాడారని అంటారు. ఈ విషయం కూడా మెగా ఫ్యామిలీ ఐక్యతకు కొంత వరకు చేటు చేసింది. ఇక తర్వాత కూడా రకరకాల కారణాలతో అన్నదమ్ముల మధ్య అంత ఎక్కువ సఖ్యత కనిపించలేదు. తాజాగా వరుణ్ తేజ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హావ భావాలు అందుకు అద్దం పట్టాయనే చెప్పక తప్పదు.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-32-30722.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





