జనసేనలోకి ఎన్టీఆర్ వస్తే..?

Publish Date:Oct 23, 2017

Advertisement

 

ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ముగిసింది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఈ పూజా కార్యక్రమంలో అసలైన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది మాత్రం పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా ఘనవిజయం సాధించాలని, అంతా మంచి జరగాలని పవన్ కోరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆతరువాత ఎన్టీఆర్ పవన్ చాలా సరదాగా... క్లోజ్ గా మాట్లాడుకున్నారు. ఒకప్పుడు రెండేళ్ల కిందట ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ ఫాన్స్ మధ్య గొడవ ఓ హత్యకి దారితీసిన ఘటన ఎంత సంచలనం రేపిందో చూసాం. అప్పుడు ఇద్దరు హీరోలు సంయమనం పాటించాలని సూచించారు. ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయి అభిమానులకు.. ఎలా మెలగాలి అన్న సందేశం ఇచ్చారు. ఇక ఇదే పవన్ కు ప్లస్ పాయింట్ అవ్వనున్నట్టు భావిస్తున్నారు.

 

ఇక ఇదంతా చూస్తుంటే ఇదేదో పొలిటికల్ గా పవన్ కు బాగానే ఉపయోగపడేట్టు కనిపిస్తోంది. పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్న సంగతి తెలిసిందే. దానికి ఇప్పటినుండే ఆయన స్కెచ్ వేస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రెడీ చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ, తన పాదయాత్ర , ఎప్పుడు, ఎక్కడి నుంచి దీన్ని  చేపట్టాలన్న దానిపై త్వరలో పవన్ నిర్ణయం తీసుకోనున్నారు.

 

మరోవైపు టీడీపీ అధినాయకత్వం ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఉంది. తాత పోలికలు, మంచి వాగ్దాటి, మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ తన వారసుడి రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డువస్తాడో అని చంద్రబాబు నాయుడు 2009 తరువాత ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వచ్చారు. దీనికి తోడు హరికృష్ణ, వల్లభనేని వంశీ, కొడాలి నాని కలిసి ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని 2014 సమయంలో గట్టిగా పోరాడారు. అయితే అపర చాణుక్యుడు ముందు వారి ఆటలు సాగలేదు. పార్టీ శ్రేణులతో పాటు అన్నగారి కుటుంబం నుండి ఎన్టీఆర్ ను విడదీసేందుకు బాలయ్యను రంగంలోకి దించారని రాజకీయవర్గాల్లో చర్చ నడిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు జూనియర్. అయితే జనసేనను వచ్చే ఎన్నికల నాటికి సంస్థాగతంగా పటిష్టపరచాలని చూస్తున్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనిలో భాగంగా ఎన్టీఆర్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తన గేమ్ ప్లాన్ లో భాగంగా.. తన ప్రియమిత్రుడు త్రివిక్రమ్ తో సినిమా చేయించి.. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కు గాలం వేయాలని భావిస్తున్నట్టు జనసేన కాంపౌండ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కనుక పవన్ తో చేరితే అది వెయ్యి ఏనుగుల బలంతో సమానం అవుతుంది. ఎందుకంటే జనసేనలో పవన్ ఒక్కడే స్టార్ క్యాంపెయినర్. 2019 నాటికి మెగా ఫ్యామిలీ పవర్ స్టార్ వెంట నడుస్తుందో లేదో తెలియదు..? కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే.. అది పవన్ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. సో.. ఎన్టీఆర్ లాంటి స్టార్ డమ్ ఉన్న వ్యక్తి జనసేనలో చేరితే పార్టీని జనాల్లోకి బలంగా వెళుతుంది.

 

మరో వెర్షన్ చూస్తే.. తొలి నుండి నందమూరి, కొణిదల కాంపౌండ్ ల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు. ఎన్టీఆర్ ఆ సామాజిక వర్గానికి దగ్గర అయితే.. సొంత సామాజిక వర్గానికి దూరమవుతాడు. అప్పుడు ఎన్టీఆర్ ను దూరం పెట్టడానికి చంద్రబాబుకు మరో అవకాశం దొరికినట్టు అవుతుంది. కాబట్టి ఎన్టీఆర్ పవన్ గాలానికి చిక్కుతాడా...?లేక...? ఇవన్నీ పుకార్లా..? అన్నది త్వరలోనే తేలిపోతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.