పవన్ పర్యటిస్తే జగన్‌కెందుకు దడ?

Publish Date:Mar 2, 2015

Advertisement

 

“అధికారం కోసం కాదు కేవలం ప్రశ్నించడం కోసమే రాజకీయాలలోకి వచ్చేనని” జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు. అంతే కాదు తాను తెదేపా, బీజేపీలకు బేషరతుగా మద్దతు ఇచ్చినప్పటికీ అవసరమయితే వాటినీ ప్రజల తరపున నిలబడి నిలదీస్తానని ఆనాడే చెప్పారు. చెప్పినట్లే ఆయన రాజధాని భూసేకరణ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అరకొర బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నించారు. అంతటితో తన పనయిపోయిందని చేతులు దులుపుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటికి వెళ్లి ఆయనని భూసేకరణ గురించి అడిగారు. అయన ఏమని సమాధానం చెప్పారో తెలియదు గానీ తనే స్వయంగా తుళ్ళూరు వెళ్లి భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను కలిసి వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలుసుకొనేందుకు సిద్దం అయినట్లు సమాచారం.

 

ఈ సంగతి తెలియగానే అందరి కంటే ముందుగా వైకాపా ఉలికి పడింది. ఆ తరువాత చాలా తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టింది. ఆయన పర్యటనకు వక్రభాష్యాలు చెప్పడం మొదలుపెట్టేసింది. అసలు ఇదంతా పెద్ద కుట్రగా అభివర్ణిస్తోంది. ఎందుకంటే రాజధాని భూసేకరణ కార్యక్రమం మొదలయినప్పటి నుండి ఆ పార్టీ స్థానిక రైతులను రెచ్చగొడుతూ ఆ ప్రక్రియకు అవరోధాలు కల్పించేందుకు తను చేయగలిగినంతా చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా భూసమీకరణను అడ్డుకోలేకపోయింది. వైకాపా సృష్టించిన ఆ అవరోధాలన్నిటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయగలిగింది.

 

ఇక మిగిలిందల్లా అంగీకార పత్రాలు ఇచ్చిన రైతుల భూములను సర్వే జరిపించి స్వాధీనం చేసుకోవడమే. ఆ కార్యక్రమం మరొక వారం పది రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకొంది. ఈ సమయంలో రైతులు సహజంగానే తీవ్ర భావోద్వేగాలకు లోనయి ఉంటారు. కనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రేపు తుళ్ళూరు మండలంలో పర్యటించి భూసమీకరణ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు చివరి ప్రయత్నం చేయాలనుకొన్నారు. కానీ ఇదే సమయంలో తెదేపాకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ తుళ్ళూరులో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారని తెలిసి వైకాపా ఆందోళన చెందడం సహజం. అందుకే పవన్ కళ్యాణ్ తుళ్ళూరు పర్యటన గురించి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడక ముందే, దాని వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ప్రచారం మొదలుపెట్టేసింది.

 

కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలవక ముందు రోజు “రైతుల ప్రయోజనాలను, పంట భూములను, పంటలను ప్రభుత్వమే కాపాడాలి. రైతుల ఉసురు తగిలితే అది ఎవరికీ మంచిది కాదు,” అని ట్వీటర్ మెసేజ్ పెట్టారు. అంటే ఆయన కూడా ఈ భూసేకరణ పట్ల అయిష్థత కలిగి ఉన్నారని స్పష్టమవుతోంది. ఆయన ఆ సందేశం పెట్టిన తరువాతనే రెండు గ్రామాల రైతులు జనసేన జెండాలు, బ్యానర్లు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. వారిని పవన్ కళ్యాణే వెనక నుండి ప్రోత్సహించారని వైకాపా ఊహాజనితమయిన కధనాలు ప్రచారం చేయడం చాలా దారుణం. ఈ విధంగా రైతుల ధర్నాల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని, అతని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నరంటూ లేనిపోని ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఉన్నత వ్యక్తిత్వం గురించి తెలిసిన వారెవరూ కూడా ఇటువంటి ఆరోపణలు, కట్టు కధలు జీర్ణించుకోవడం కష్టం.

 

అసలు ఆయన పర్యటనకు కేవలం వైకాపా మాత్రమే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తోంది? ఎందుకు కంగారు పడుతోంది? ఆయన అసలు బయలు దేరుతున్నారో లేదో కూడా తెలియక ముందే ఇలా బోడి గుండుకి మొకాలుకి ముదేస్తూ ఎందుకు ప్రచారం చేస్తోంది? ఆయన రైతులను ఒప్పించినా లేక వారితో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదలచుకొన్నా వైకాపాకి ఏమిటి అభ్యంతరం? ఏమిటి కష్టం? రైతుల తరపున నిలబడి పోరాడుతున్నాని వైకాపా చెప్పుకొంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కలిస్తే ఆయనను ఆహ్వానించకపోగా ఎందుకు ఆందోళన చెందుతోంది? అని ప్రశ్నించుకొంటే ఈ భూసేకరణ అంశాన్ని వైకాపా ఎందుకు ఉపయోగించుకొంటోందో, దాని ఉద్దేశ్యాలు ఏమిటో అర్ధం అవుతాయి.

 

భూసమీకరణ వల్ల రైతులకు ఎటువంటి నష్టమూ కలగకుండా తను హామీ ఉంటానని పవన్ కళ్యాణ్ రైతులకు నచ్చజెప్పి ఒప్పించేస్తే, అప్పుడు వైకాపా ఇంతకాలంగా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. లేదా ఆయన ఆఖరి నిమిషంలో ప్రవేశించి తను మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని దొరకబుచ్చుకొని మొత్తం క్రెడిట్ అంతా స్వంతం చేసేసుకొంటారనే భయం వల్ల కావచ్చును. రైతుల తరపున పోరాడుతున్నామని చెపుతూ రైతులను మభ్య పెడుతూ వారికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు దీనినే ఆయుధంగా చేసుకొని తన రాజకీయ ప్రతర్ది అయిన అధికార తెదేపాను అప్రతిష్టపాలు చేయాలని వైకాపా తహతహలాడుతోంది. అందుకే ఇటువంటి సమయంలో అందరూ అభిమానించే పవన్ కళ్యాణ్ తుళ్ళూరులో పర్యటించబోతున్నారనే వార్త వినబడగానే కంగారు పడుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా అప్పుడే చెడు ప్రచారం ఆరంభించేసింది. ఈవిధంగా ప్రతీ అంశాన్ని కూడా రాజకీయం చేయడం వలననే వైకాపా ప్రజల విశ్వాసం పొందలేకపోతోంది. మరి ఈ విషయం ఎప్పటికయినా గ్రహిస్తుందో లేదో?

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.