తిరుపతిలో పాల్ పర్యటన వినోదాత్మకం

Publish Date:Aug 3, 2022

Advertisement

కేఏ పాల్.. పరిచయం అక్కర్లేని పొలిటికల్ కమేడియన్. ఆయన ఎప్పుడు ఎక్కడ ప్రసంగించినా.. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నవ్వులు పూయడం ఖాయం. ఆయన విమర్శలను ఏ పార్టీ వారూ సీరియస్ గా తీసుకోరు. ఆయన విమర్శలకు ఎవరి నుంచీ ఖండనలు ఉండవు. ఏ పార్టీ వారూ స్పందించరు. అయినా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే విలేకరులు పరుగు పరుగున వాలిపోతారు. ఎలక్ట్రానిక్ మీడియా రెక్కలు గట్టుకుని వాలిపోతారు. పత్రికలలో ఆయన ప్రసంగాలకు స్పేస్ లేకపోవడమనే మాటే ఉండదు.

టీవీలలో ఆయన ప్రసంగాల క్లిప్పింగ్స్ కు ఒకింత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే జనం ఆయన ప్రసంగాలను అంత ఇష్టంతో వింటారు, చదువుతారు కనుక. మత ప్రబోధకుడి నుంచి రాజకీయ వేత్తగా మారిన తరువాత కేఏ పాల్ తన ప్రసంగాలలో కూడా రాజకీయ ప్రభోదాలే చేస్తారు. అలా ప్రబోధించడంలో ఆయనకు తన పర బేధం లేదు. ఆయన ఎవరినైతే, ఏ పార్టీనైతే విమర్శిస్తారో వారికీ , ఆ పార్టీలకూ కూడా సుద్దులు చెబుతారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరూ అంటే అన్ని పార్టీలూ తన వెనుకే నడిస్తేనా ఆ పార్టీలకు మనుగడ అని ఉద్భోదిస్తారు. తాజాగా తిరుపతి పర్యటనలో ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయంపై చాలా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్, చంద్రబాబులు ఓటమి ఖాయమని తేల్చేశారు. రెండు రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చేది తన ప్రజాశాంతి పార్టీయేనని తేల్చేశారు. తాను తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాననీ, ఏపీలో ఒక మహిళా నేతను సీఎంను చేస్తాననీ పాల్ చెప్పారు.  ఏపీలో జనసేనానికి అసలు ప్రజాభిమానమే లేదన్నారు.

తనకున్న ప్రజా మద్దతుతో పోలిస్తే పవన్ కల్యాణ్ కు ఉన్న మద్దతు ఏపాటిదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవాలంటే జగన్, చంద్రబాబు తమతమ పార్టీలను ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయడం బెటరని సలహా ఇచ్చారు. ఇక జాతీయ నేతలకూ ఆయన తన రాజకీయ ప్రబోధం చేశారు. తానిచ్చిన విలువైన సలహాలను పాటించకపోవడం వల్లే మోడీకి ప్రజా మద్దతు భారీగా తగ్గిపోయిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ గద్దె దిగడం ఖాయమనీ జోస్యం చెప్పారు.

పాల్ ఏం చేసినా, ఏం మాట్లాడినా ప్రచారానికి ఢోకా ఉండదు. అయినా ఆయన అదనపు ప్రచారం కోసం కొన్ని ఫీట్లు చేసి మరీ వినోదం పంచుతారు. తిరుపతి పర్యటనలో కూడా అదే చేశారు. ఆయన తన వాహనంలో పద్మావతి మహిళా యూనివర్సిటీలోకి దూసుకెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా ఆగలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు వచ్చి ఆయనను పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే పాల్ మాత్రం కారులోనూ కూర్చుని తన సొంత వాహనంలోనే   పోలీసు స్టేషన్ కు వస్తానని భీష్మించారు. చివరకు పోలీసులు అతి బలవంతం మీద ఆయనను వర్సిటీ నుంచి బయటకు పంపేశారు. తరువాత తీరిగ్గా కేసు నమోదు చేశారనుకోండి. మొత్తం మీద పాల్ తిరుపతి పర్యటన అంతా వినోదాల జల్లు పంచుతూ సాగింది. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.