కృష్ణాడెల్టాకు జీవనాధారంగా పట్టిసీమ.!

Publish Date:Jul 11, 2026

Advertisement

సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన  తీవ్ర వర్షాభావ పరిస్థితులలో కూడా  కృష్ణా డెల్టా ఆయకట్టును పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరోసారి ఆదుకుంది. కృష్ణా బేసిన్ పరిధిలోని ఎగువ జలాశయాలన్నీ అడుగంటిపోవడంతో కృష్ణా డెల్టా పరిధిలోని వ్యవసాయ భూములు ఎండిపోయే ప్రమాదం నుంచి  గోదావరి వరద జలాలను కృష్ణా నదికి తరలించడం ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు జీవనాధారంగా నిలిచింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమతో పాటు తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను అధికారికంగా పునఃప్రారంభించి, కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదలను పునరుద్ధరించారు.

ప్రస్తుత సీజన్‌లో ఎల్ నినో పంజా విసరడం వల్ల రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎండల తీవ్రతకు జలాశయాల్లోని నీరు ఆవిరైపోయే పరిస్థితులు తలెత్తాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులు ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం,  నాగార్జున సాగర్ వైపు నుంచి ఎగువ ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో సముద్రంలో వృథాగా కలిసిపోయే గోదావరి   నీటిని కృష్ణా డెల్టా వైపు మళ్లించేందుకు  తెలుగుదేశం  నిర్మించిన పట్టిసీమ పథకం దోహదపడింది.  

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.   సీఎం నారా చంద్రబాబు నాయుడు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చాలా సమయం పడుతుంది కనుక, తక్షణ ఉపశమనంగా  1,300 కోట్ల రూపాయల వ్యయంతో రికార్డు కాలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. అయితే..  ఆ సమయంలో ఈ ప్రాజెక్టు తీవ్ర రాజకీయ వివాదాలకు, విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. అప్పటి ప్రతిపక్ష నేత   జగన్  ఒట్టిసీమగా అని అభివర్ణించారు.  అయితే ఆ పట్టిసీమే కృష్ణా డెల్టాను ఆదుకుని అప్పడే గట్టి సీమ అని నిరూపించుకుంది.  ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ పట్టిసీమను పూర్తిగా విస్మరించారు. 

ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లోనూ రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా వరప్రదాయినిగా ఆదుకుంటోంది. ప్రాజెక్టు పునఃప్రారంభం సందర్భంగా గోదావరి జలాలకు మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా  జలహారతి  ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి..  మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యంగా పట్టిసీమను అభివర్ణించారు.  పట్టిసీమ ప్రాజెక్టు  రాష్ట్ర వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. ఇప్పటివరకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రికార్డు స్థాయిలో 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు విజయవంతంగా మళ్లించగలిగామన్న రామానాయుడు..  ఈ నీటి సరఫరా కారణంగా కృష్ణా డెల్టా పరిధిలో పంటలు సమృద్ధిగా పండటమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ. 50 వేల కోట్లకు పైగా సంపద,  ఆదాయం చేకూరిందని  గణాంకాలతో వివరించారు.

 ఐదేళ్ల  జగన్ పాలన కేవలం రాజకీయ వైషమ్యాలు, అవగాహనా రాహిత్యం కారణంగానే గత ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్వహణను పూర్తిగా గాలి కొదిలేసిందని విమర్శించారు. ఒకప్పుడు ఈ ప్రాజెక్టును అవహేళన చేసిన వారే..  కృష్ణా డెల్టా కరవు కోరల్లో చిక్కుకున్న వేళ ఈ నీటిపైనే ఆధారపడాల్సి వచ్చిందన్నారు. పట్టిసీమపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కృష్ణా డెల్టా రైతులకు సమాధానం చెబుతారని మంత్రి నిలదీశారు. 

Pattiseema Lift Irrigation, Krishna Delta, Nimmala Ramanaidu, El Nino AP Drought, Chandrababu Naidu Water Management

By
en-us Political News

  
తన సతీమణి సాధించిన ఈ గొప్ప విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో ముందడుగు వేస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఆదర్శంగా నిలవాలని నారాలోకేష్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన పోస్టులో ఆకాంక్షించారు.
భారతీయ మార్కెట్లో మిడ్, స్మాల్ క్యాప్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కొత్త త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్, టీసీఎస్ లలో ఇన్వెస్ట్ చేయడానికి నిపుణులు ఇస్తున్న బెస్ట్ స్ట్రాటెజీ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద మెగా డ్యామ్ కింద ప్రమాదకరమైన భూకంప రేఖ ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలే గుర్తించారు. ఈ ప్రాజెక్టుతో భారత్‌కు పొంచి ఉన్న ముప్పేంటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
AMFI తాజా జూన్ డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఫ్లెక్సీ క్యాప్ కంటే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 30 నెలల తర్వాత జరిగిన ఈ మార్పునకు కారణాలు, వాటి రిటర్న్స్ వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 90కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేయగా, ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. పెరిగిన ముడి చమురు ధరల వివరాలు మరియు తాజా పరిణామాలు ఇక్కడ చూడండి.
గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ల మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు మరియు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వివాదం అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌ను ఎలా అతలాకుతలం చేస్తున్నాయో, దీనివల్ల భారత్‌పై పడే ఆర్థిక ప్రభావం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
రష్యా సైనిక డ్రోన్లలో ఐరోపా‌కు చెందిన అత్యాధునిక మైక్రోచిప్స్ విరివిగా లభ్యమవ్వడం సంచలనం సృష్టిస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తుంగలో తొక్కి, చైనా సరఫరా నెట్‌వర్క్ ద్వారా రష్యాకు చేరుతున్న ఈ రహస్య చిప్స్ మరియు గెరానియం డ్రోన్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఓకిటెల్ WP68 ఎయిర్ రగ్గడ్ ఫోన్ పూర్తి రివ్యూ ఇక్కడ చూడండి. 8000mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ మరియు ఆండ్రాయిడ్ 16 వంటి అద్భుతమైన ఫీచర్ల వివరాలు, ధర మరియు పనితీరు విశ్లేషణ మీకోసం.
భారతీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు మళ్లీ వరదలా వస్తున్నాయి. జూన్ నెలలో ఏకంగా 26 శాతం పెరిగిన ఈక్విటీ ఇన్‌ఫ్లోస్, టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ మరియు నిపుణుల కీలక అంచనాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
దేశ రాజధానిలో.. అది కూడా అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి దారుణ హత్యకు గురికావడం పాక్ ప్రభుత్వానికి, ఆ దేశ సైన్యానికి పెద్ద అవమానంగా మారింది. ఇక భద్రతా లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ అబద్ధాల కథలల్లింది. వాటినే వాస్తవాలుగా అధికారికంగా ప్రకటనల రూపంలో వెల్లడించింది.
భారత స్టాక్ మార్కెట్లో ఐపీఓల జాతర ప్రారంభం కానుంది. రాబోయే రెండేళ్లలో జియో, ఎన్‌ఎస్‌ఈ సహా 210 కొత్త తరం కంపెనీలు ఐపీఓకి సిద్ధమవుతున్నాయి. పూర్తి వివరాలు మరియు మార్కెట్ అంచనాల కోసం ఇప్పుడే చదవండి!
రూ. 11,600 కోట్ల ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ భారీ ఐపీఓ వివరాలు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ మరియు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలతో వ్యాల్యుయేషన్ పోలిక, ప్రైస్ బ్యాండ్ మరియు ఇన్వెస్టర్ల లాభాల అంచనా విశ్లేషణ.
భుజాల నొప్పి తీవ్రం కావడంతో పవన్ కల్యాణ్ గత వారం ముంబై వెళ్లి కొకిలా బెన్ అంబానీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. వారు వెంటనే సర్జరీ అవసరమని చెప్పినప్పటికీ.. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలు ఉండటంతో పవన్ సర్జరీని వాయిదా వేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.