Publish Date:Jun 18, 2026
అమెరికాలోనే అత్యంత రద్దీగా ఉండే, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ కూడలి గురువారం (జూన్ 18) ఒక్కసారిగా రణరంగంగా మారింది. అంతవరకు ఎంతో ఉల్సాహంగా సాగిన సంబరాల వాతావరణం క్షణాల వ్యవధిలో భయానకంగా మారిపోయింది. కారణం అక్కడ ఒక్కసారిగా వినిపించిన తుపాకీ పేలుళ్లు. న్యూయార్క్ నిక్స్ బాస్కెట్బాల్ జట్టు ఏకంగా 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రతిష్టాత్మకమైన బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకోవడంతో లోయర్ మాన్హట్టన్ ప్రాంతంలో నగర చరిత్రలోనే నిలిచిపోయేలా ఒక భారీ విజయోత్సవ పరేడ్ను నిర్వహించారు. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
అయితే.. ఆ సంబరాలు ముగిసిన గంటల వ్యవధిలోనే.. టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. నల్లని దుస్తులలో ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలివానగా మారింది. కాల్పులకు దారితీసింది. ఆ ఇద్దరూ తుపాకులతో కాల్పులకు తెగబడటంతో అక్కడ ఉన్న వేలాది మంది భయాందోళనలకు లోనయ్యారు. ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపి జనం మధ్య నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/panic-over-shooting-in-new-york-times-square-36-223478.html
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్