విజ‌య సార‌ధి ఇమ్రాన్

Publish Date:Jul 27, 2018

Advertisement

పొరుగుదేశం పాకిస్తాన్‌లో ఎన్నికల పర్వం ముగిసింది. ఎవరూ ఊహించనంతగా మాజీ క్రికెటర్, స్పీడ్ స్టార్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్  ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యావత్ ప్రపంచానికి దిగ్బ్రాంతి కలిగించే విధంగా అక్కడి ఎన్నికలు జరిగాయి.  ప్రపంచవ్యాప్తంగా  అన్ని దేశాలు ఈ ఎన్నికలను నిశితంగా పరిశీలించాయి. ఇమ్రాన్‌ఖాన్‌పై పాక్ ప్రజలకు ఆరాధన, ఆయన్ని గెలిపించాలని ఉన్నా.. ఈ ఎన్నికల ప్రక్రియలో సైన్యం పాత్ర చాలా ఎక్కువగా ఉంది. వారే దగ్గరుండి ఈ ఎన్నికలను నిర్వహించి ఇమ్రాన్‌ఖాన్ విజయం సాధించేలా చేసాయని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇది ఎంత వరకూ నిజమో తేలాలంటే కొన్నాళ‌్లు వేచి చూడాల్సిందే. మరోవైపు మైదానాల్లోనే తమ ఆరాధ్య క్రీడాకారులకు ప్రేక్షకులు నీరాజనాలు పలకరని, వారిని తమ పాలకులుగా కూడా చేసుకోవడానికి వెనుకాడరని పాకిస్తాన్ ఎన్నికలు రుజువు చేశాయి.

 

 

క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు ఓ సందేశం అందింది. అది మైదానంలో తమను దేవుళ్లుగా చూసే అభిమానులు తమ నుంచి కేవలం ఆటలో గొప్పతనాన్నీ, అద్భుత ప్రదర్శనను మాత్రమే ఆశించడం లేదని చాటి చెప్పారు పాకిస్తాన్ ప్రజలు. పాకిస్తాన్ ఎన్నికలు ఆటలు, ప్రజలకూ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. విజయమంటే అలా అలవోకగా తెచ్చుకునేది కాదని, లేదూ ప్రత్యర్ధుల బలహీనతల నుంచి వచ్చేది కాదని ఇమ్రాన్ ఖాన్ తన విజయంతో నిరూపించారు. ఈ గెలుపు కోసం ఇమ్రాన్ ఖాన్ చాలా కష్టపడ్డారు. ఎంతో శ్రమించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నిటింకీ సమాధానమే ఈ విజయం అని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల‌్డ్ స్మిత్ ట్విట్ చేసిందంటే ఇమ్రాన్ ఖాన్ ఎంత కష్టపడ్డారో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఈ శ్రమంతా అక్కడి సైన్యం, ఐఎస్ఐ వంటి ఉగ్రవాదుల జోక్యంతో నీరుగారిపోయింది. పాకిస్తాన్ ఎన్నికల్లో 272 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఇమ్రాన్ ఖాన్‌కు అధికారానికి కావాల్సిన అన్ని స్ధానాలు దక్కాయి. ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధికార పగ్గాలు అందుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 137 స్ధానాలకు దగ్గర దగ్గరగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడం ఖాయం. 

 

 

ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులు. నిత్యం అలజడులతో, ఆందోళనలతో, సైనిక చర్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు కావాల్సింది ప్రశాంతత. ఇది కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎలా తీసుకు వస్తారనేది అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా చూపిస్తున్న కొన్ని దేశాలకు ఇమ్రాన్‌ఖాన్ ఎలా సమాధానం చెప్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్ కూడా ఎన్నికలకు ముందు దేశ సైన్యానికి దగ్గర అని, మరోవైపు ఉగ్రవాద సంస్ధలకు కూడా దగ్గరని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొన్నిసార్లు ఇమ్రాన్‌ఖాన్ ఉగ్రవాద సంస్ధలకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ ఇమ్రాన్‌ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కొత్త కష్టాలు తీసుకురాక తప్పదు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపులోనే సైన్యం కీలకంగా వ్యవహరించడంతో అక్కడి ప్రజాస్వామ్యంపై అనుమానపు నీలినీడలు వస్తున్నాయి. ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్ తీసుకునే ప్రతి నిర్ణయంపైనా పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచ దేశాలన్నింటిలోనూ చర్చను రేపుతాయి. ముఖ్యంగా భారతదేశంతో ఆయన అనుసరించే వైఖరిపై ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తాయి.

 

 

అధికారంలోకి రావడానికి ముందూ... వచ్చిన తర్వాత మరో విధంగానూ దేశం ఉంటుందని ఇమ్రాన్‌ఖాన్‌కు త్వరలోనే అర్ధం అవుతుంది. ఓ క్రికెట్ క్రీడాకారునిగా, ఫాస్ట్ బౌలర్‌గా బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులతో మైదానంలో  బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందుల పాలు చేసిన ఇమ్రాన్ ఖాన్ ఇక ముందు ప్రతిపక్షాలు, పొరుగు దేశాల నుంచి వచ్చే బౌన్సర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా పాక్ సైనికులు, అక్కడ ప్రతి విషయంలోనూ కలుగుజేసుకునే ఉగ్రవాదసంస్ధలతోనూ ఎలా వేగుతారో వేచి చూడాలి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఎదుర్కొనే ప్రధాన సమస్య భారత్. అది కూడా
కాశ్మీర్‌పై ఇమ్రాన్‌ఖాన్ వైఖరి ఎలా ఉంటుందనేది ప్రధాన ప్రశ్న. తొలి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌కు భారత్ పట్ల అంత మంచి అభిప్రాయం లేదని ఇరు దేశాలకు చెందిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇమ్రాన్‌ఖాన్ మాత్రం భారత్ పట్ల తాను సానుకూలంగానే వ్యవహరిస్తానని,కాశ్మీర్ సమస్యను సానుకూలంగానే పరిష్కారం అయ్యేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు. అంతే కాదు.... పేదరిక నిర్మూలనకు తనకు చైనా ఆదర్శమని కూడా ప్రకటించారు.

 

 

ఇది శుభపరిణామం. భారత్‌తో తాను క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాను అని కాకుండా ఇరు దేశాలకు చెందిన కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన అంశంగా చూస్తే బాగుంటుందని సర్వత్రా వినిపిస్తోంది. భారతదేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పదవీ కాలం మరో ఏడాదే ఉంది. ఈ లోగా పెద్దగా ఏమీ జరగకపోవచ్చు కాని... ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు... వారితో పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుందన్నదే ఇక్కడ ముఖ్యం. కొత్త ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు వ్యాఖ్యానాలు చేయడం కాని, ప్రకటనలు చేయడం కాని సమంజసం కాదు. క్రీడాకారునిగా ఎంతో పరిణితితో వ్యవహరించి క్రికెట్‌లో ఆ దేశానికి వరల్డ్ కప్ తీసుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ తన పాలనతో కూడా ప్రపంచవ్యాప్తంగా అందరి మనసులను దోచుకుంటాడని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ ఇమ్రాన్.
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.