పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ ... రాజకీయాల నుంచి   నటుడిగా మారిన ఈ మాజీ క్రికెటర్ 

Publish Date:Nov 11, 2024

Advertisement

పాడి కౌశిక్ రెడ్డి. ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో  మారు మ్రోగిపోతుంది, గతంలో  పిఏసీ చైర్మెన్  పదవిఅరికెపూడికి రేవంత్ సర్కారు ఇవ్వడంతో ఒంటి కాలిపై లేచినంత పని చేశాడు. పాడి కౌశిక్‌ రెడ్డి హైదరాబాద్ జట్టుకు దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించాడు. అయన తన తొలి మ్యాచ్ ను పంజాబ్ తో  తలపడ్డాడు. 2004 డిసెంబరు 22 వతేదీన ఈ మ్యాచ్  ఆడాడు. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గా, మీడియం పేసర్ గా జట్టుకు సేవలందించాడు. ప్రస్తుత రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్  అని చెప్పొచ్చు. తన స్వంత పార్టీకి చెందిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి కాంగ్రెస్ వైపు చూసినప్పుడు కౌశిక్‌ రెడ్డి పావుగా కెసీఆర్ గేమ్ ఆడారు. కెసీఆర్ కనుసన్నల మీదే కౌశిక్ రెడ్డి అరికెపూడిపై చెలరేగిపోయారు. బిఆర్ ఎస్ జెండాపై గెలిచి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని బిఆర్ ఎస్ నేతలను  గట్టిగా నిలదీసిన ఏకైక  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని చెప్పొచ్చు. తన చివరి మ్యాచ్ 2007లో ఆడి, క్రికెట్ నుండి శాశ్వతంగా తప్పుకున్నాడు.  ఆయన  రాజకీయ గురువు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి రాజకీయ గురువు ఉత్తమ్  కుమార్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి  ఓవర్ నైట్ లో బిఆర్ఎస్ లో చేరిపోయారు.హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ చేతిలో  ఘోరంగా ఓడిపోయారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఈటెల రాజేందర్ పై బిఆర్ ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈటెల వంటి పవర్ పుల్ పొలిటిషియన్   రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకుంటున్న కౌశిక్ రెడ్డి చేతిలో  ఓడిపోవడంతో  చర్చనీయాంశమయ్యారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ దృష్టిలో పడ్డ  కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో జంప్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. కెసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం లేదని రెచ్చిపోయారు. 
పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ నటనలో ఆరితేరిపోతున్నారు. కేసీఆర్ హయాంలో పెండింగ్ లో పెట్టిన దళిత బంధు నిధుల్ని ఇవ్వాలని తాజాగా ఆయన చేసిన రచ్చ చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఆయన కోసం వందల మంది రాలేదు. పట్టుమని పది మంది కూడా లేరు. కానీ పోలీసుల సాయంతో..తన సోషల్ మీడియా టీం క్రియేటివిటీతో ఆయన చేసిన రచ్చ చూసి అందరూ ఔరా అనుకున్నారు. కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా స్టార్ గా మారి పోయారు.  ఆయన పండించిన సన్నివేశాల్లో స్పృహ తప్పడం దగ్గర నుంచి ఆస్పత్రిలో చొక్కా విప్పేసి మీడియాతో మాట్లాడటం చివరికి చేతికి కట్టుతో బయటకు రావండి వరకూ చాలా ఉన్నాయి. కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆయన రాజకీయాలు నడుపుతున్నారు. నన్ను హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన రాజకీయ నేత కౌశిక్ రెడ్డి.  
తనను గెలిపించకపోతే  ఎన్నికల రోజు  ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్  చేశారు. అప్పట్నుంచి ఆయన కామెడీ స్టార్ గా మిగిలిపోయారు. పీఏసీఎ చైర్మన్ వివాదంలో ఆయన పై దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో తన్నులు తిని హస్య సన్నివేశాన్ని పండించారు. రేవంత్ రెడ్డి వీడియోలు తన వద్ద ఉన్నాయని కౌశిక్ రెడ్డి అంటున్నారే గానీ వాటిని బయటపెట్టకపోవడం బట్టి ఆయన ఉద్దేశ్యం ఏమిటో ప్రజలు ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. 

By
en-us Political News

  
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.