పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న ఆపరేషన్ కగార్!

Publish Date:May 1, 2025

Advertisement

ఆపరేషన్ కగార్.. ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఆదివాసీలను ఇబ్బంది పెట్టేలా బ్లాక్ హిల్స్ లో సెర్చ్ ఆపరేషన్ ఏంటన్న ప్రశ్నలను వామపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, బీఆర్ఎస్ వినిపిస్తున్నాయి. పార్టీ నిర్ణయం తర్వాత శాంతి చర్చలపై నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.  ఛత్తీస్ గఢ్ వైపు నుంచి వచ్చిన బలగాలు కర్రెగుట్టలను ఈనెల 21న చుట్టుముట్టాయి. అప్పటి నుంచి కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. మొత్తం 24 వేల మంది బలగాలతో ఆపరేషన్ కగార్ సంచలనంగా మారింది. 

బ్లాక్ హిల్స్, దుర్గం గుట్టలు మావోయిస్టులకు స్ట్రాటజిక్ లొకేషన్. ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు, ఇతర ప్లీనరీలు, భారీగా ఆయుధ డంపులు, ట్రైనింగ్ జరుగుతున్నదన్న ఉద్దేశంతో బలగాలు ఈ గుట్టలను రౌండప్ చేస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల నిఘాలో జల్లెడపడుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ తో తెలంగాణ పోలీసులకు సంబంధం లేదని పోలీస్ వర్గాలు అంటున్నాయి. కేంద్ర బలగాలే లీడ్ చేస్తున్నాయని చెబుతున్నారు. 

బ్లాక్ హిల్స్ లో ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అటు చర్చల విషయంపై మావోయిస్టుల లేఖలు కూడా బయటికొచ్చాయి. ఇక లెఫ్ట్ పార్టీల నేతలు, పౌర హక్కుల సంఘాలు కూడా ఆపరేషన్ కగార్ ను ఖండించాయి. శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు ఎదురు నిలిస్తే నేరమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదని ప్రొఫెసర్ హరగోపాల్, కూనంనేని సహా పలువురు కామెంట్ చేస్తున్నారు. చర్చలకు వస్తామని అంటున్నా చంపడమేంటని ప్రశ్నిస్తున్నారు.  అంతకు ముందు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కూడా ఆపరేషన్ కగార్  ను ప్రస్తావించారు. ఎన్ కౌంటర్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బలవంతంగా మావోయిస్టులను అంతం చేయడం కాకుండా శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,500 మంది నక్సలైట్లు లొంగిపోయారని, రెడ్ కారిడార్ రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నారు. ఆపరేషన్ కగార్‌ను మారణకాండగా అభివర్ణిస్తూ తెలంగాణలో చాలా చోట్ల నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. భారత్ బచావో   వంటి సంస్థలు ఆపరేషన్‌ కగార్ ను ఆపాలని తెలంగాణ మంత్రి సీతక్కను కోరాయి. అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగా ఆదివాసీలను బలిపశువులుగా చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నాయి  తుడుం దెబ్బ వంటి సంస్థలు.  కర్రెగుట్టలో ఆపరేషన్‌ను ఆపాలని, ఆదివాసీలు భయాందోళనలో ఉన్నారని, వారికి తాగునీరు కూడా అందని దుస్థితి నెలకొందని అంటున్నారు. 

మరోవైపు ఆపరేషన్ కగార్ పై రాష్ట్ర బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. చేతిలో తుపాకీ పట్టుకొని శాంతి చర్చలు అనడం ఎంత వరకు సమంజసం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.   శాంతి చర్చల కంటే ముందు మావోయిస్టులు తుపాకులు వదలాలని, తుపాకులు వదిలేస్తున్నామని ప్రకటించి శాంతి చర్చలకు రావాలన్నారు. సో ఆపరేషన్ కగార్ కాస్తా పొలిటికల్ కగార్ గా మారిపోయింది. ఇది ఇప్పుడు తెలంగాణలో ఇదోక సెన్సిటివ్ ఇస్యూ గా మారింది. బలగాలు మాత్రం కూంబింగ్ ఆపడం లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.

By
en-us Political News

  
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.