Publish Date:Jun 14, 2022
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఏపీలో బీజేపీ అత్యంత బలమైన పార్టీగా కనిపిస్తోంది. తమకంత బలం ఉందని బీజేపీ వాళ్లే అనుకోవడం లేదు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ కాగానే ఒక్కసారిగా ఏపీలో బీజేపీ విశ్వరూప సందర్శనం జరిగిపోయినట్లు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడినా కవర్ చేసే మీడియా ఉండటం, ఆయన ఒక మేధావి అనే భ్రమను ప్రజలలో కల్పించే కొందరు పొలిటీషియన్లు ఉండటం కూడా ఉండవల్లికి కలిసొచ్చి ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందనుకుంటున్నారు. ఏపీలో బీజేపీ బలం ఏమిటో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు గమనిస్తే చాలు ఆ పార్టీ బలం ఎంతన్నది తెలుసుకోవడానికి. ప్రత్యేకించి ఆ పార్టీని భుజాన వేసుకుని.. కేసీఆర్ కు భుజకీర్తులు అద్దడానికి ఉండవల్లి ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది అర్ధం చేసుకోలేనంత అమాయకులు కాదు జనం. కేసీఆర్ ఒక్కరు మాత్రమే దేశంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనగలిగే నాయకుడని ఏపీ ప్రజలకు చెప్పడానికి ఉండవల్లి తెగ తాపత్రేయపడుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో మిత్రపక్షంగా ఉండి కూడా ఆ పార్టీని గట్టిగా ఎదుర్కొన్న విషయం.. రాజకీయ పండితుడైన ఉండవల్లి ఎలా, ఎందుకు మరచిపోయారో ఆయనే చెప్పాలి. అంతకంటే ముందు గుజరాత్ లో అల్లర్ల సమయంలో మోడీని సీఎంగా తొలగించాలన్న డిమాండ్ తో ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన సంగతి ఉండవల్లికి తెలియదా.
విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరాతి కి అంకురార్పణ జరిగిన సమయంలో ఉండవల్లి కుల విద్వేషాలను రెచ్చెగొట్టే పుస్తకాల ఆవిష్కరణలో యమా బిజీగా ఉన్న సంగతి ఏపీ జనం మరచిపోతారా? మరచిపోగలరా? తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడికి అనకూలంగా అవసరమైన ప్రతి సందర్భంలోనూ గొంతెత్తే ఉండవల్లి ఇప్పుడు కేసీఆర్ తో భేటీ అనంతరం ఏపీలో బీజేపీ బలాన్ని ఆకాసానికెత్తేస్తూ మాట్లాడిన మాటలు కూడా జగన్ కు ఏదో మేర మేలు చేకూర్చేందుకేనన్నది పరిశీలకుల విశ్లేషణ.
వాస్తవానికి ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే బీజేపీ బలంగా ఉంది. అంతే కాదు 2019తో పోలిస్తే ఇప్పుడు మరింత బలోపేతమై టీఆర్ఎస్ కే సవాలు విసురుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఉండవల్లి ఏపీలో బీజేపీ బలం కనిపించింది. బీజేపీని ఎదుర్కొనగల ధీరత్వం కేసీఆర్ కు మాత్రమే ఉందని పించింది. కేసీఆర్ జాతీయ పార్టీకి ఏపీలో సానుకూలత తెచ్చి పెట్టేందుకు ఉండవల్లికి ఇంత తాపత్రయం ఎందుకు.
రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని చెబుతున్న వ్యక్తి కేసీఆర్ ను భుజాన వేసుకుని మోయడమెందుకు? ఏపీలో జగన్ కు ఎన్ని కల వ్యూహాలు రచించి పెట్టే పీకే సమక్షంలో కేసీఆర్ తో భేటీ అయిన ఉండవల్లి వైఎస్ కుమారుడికి రాష్ట్రంలో రాజకీయ లబ్ధిచేకూర్చేందుకే కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/only-vundavally-see-bjps-strength-in-ap-25-137616.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.