ఒంగోలు టు రాజమహేంద్ర వరం!.. దేశం జోష్ బ్రహ్మాండం!

Publish Date:May 28, 2023

Advertisement

టైమ్ మనది కానప్పుడు.. వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయడం వల్ల వచ్చే ఫలితాలు సూపర్బ్ గా ఉంటాయి. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. సూపర్‌గా కిక్ ఇస్తాయి. ప్రస్తుతం ఆ కిక్ ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంజాయి చేస్తున్నాయి. ఉదాహరణ  చెప్పాలంటే.. తాజాగా రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన మహానాడు మహాద్భుత విజయం సాధించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తారు. అయితే ఈ మహానాడు సూపర్ సక్సెస్‌ కావడంపై పోలిటికల్ సర్కిల్‌లో వాడీవేడీ చర్చ జరురగుతోంది.

గత ఏడాది అంటే 2022 మే 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన మహానాడు... నుంచి సైకిల్ పార్టీ శ్రేణుల్లో  నయా జోష్ కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. ఈ మహానాడు వేదికగానే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభ ప్రకటన చేయడం.. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తామని వెల్లడించడం.. అదే విధంగా జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం... చివరకు తెలంగాణ  లోని ఖమ్మం వేదికగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన శంఖారావ సభ విజయవంతం కావడంతో అక్కడి పార్టీ శ్రేణుల్లో సైతం కొత్త జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది.  

అయితే ఈ శంఖారావ సభ సక్సెస్‌తో అధికార గులాబీ పార్టీలో   గుబులు  రేగింది.  ఇక హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు ప్రజల నుంచి విశేష స్పందన రావడం.. అదే విధంగా అటు విజయవాడలో ఇటు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించడం.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటుని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ కైవసం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.   

ఈ వరుస పరిణామాలన్నీ నిశీతంగా పరిశీలిస్తే.. ఒంగోలులో నిర్వహించిన మహానాడు నుంచి రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం శ్రేణుల్లో  ఉత్సాహం ఉరకలేస్తోందని పోలిటికల్ సర్కిల్‌లో  బలంగా వినిపిస్తోంది.  ఒక్క సారి 2019 నుంచి 2022 మే వరకు చోటు చేసుకొన్న పరిణామాలను గమనిస్తే.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. దీంతో ఆ ఏడాది ఆ పార్టీ ఆధినాయకత్వం మహానాడును నిర్వహించ లేదు. ఇక 2020లో కరోనా వేళ.. మహానాడు ఊసే లేదు. ఆ మరుసటి ఏడాది అంటే 2021లో కూడా కరోనా ఎఫెక్ట్‌తో మహానాడు నిర్వహించలేదు కానీ... టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహించగా.. దానికి మంచి స్పందన అయితే వచ్చింది. 

మరోవైపు   జగన్.. గద్దెనెక్కిన తర్వాత తొలి కేబినెట్‌లోని మంత్రుల బూతుల పంచాంగానికి... అలాగే ప్రతిపక్ష పార్టీ నేతగా  జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు.. ఆయన గద్దెనెక్కిన తర్వాత అమలు చేస్తున్న విదివిధానాలకు ఎక్కడా పొంతన లేదని.... దీంతో  జగన్  పాలనపై ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమౌతోంది కానీ ...  అది ఏ స్థాయిలో ఉందనేది మాత్రం ఎవరికి ఇతమిద్దంగా అంతు పబట్టని విధంగా.. అర్థం కానీ విధంగా ఉండేది.. కానీ 2022లో ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడుకు  జనం పోటెత్తారు.

దీంతో జగన్ పాలనపై ప్రజలు క్లారిటీగా ఉన్నారని.. వారంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని.. నిన్న.. నేడు.. రేపు కూడా ఆ పార్టీతోనే కలిసి నడుస్తారని అందరికీ అర్థమైంది. తాజాగా రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడుతో అది సుస్పష్టమైందని  రాజకీయవర్గాల్లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మహానాడు విజయవంతం కావడంతో.. రాబోయే ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ తప్పకుండా సత్తా చాటి... అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో  బలంగా వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.