తెలుగుజాతికి పెద్ద పండుగ మహానాడు!

Publish Date:May 27, 2023

Advertisement

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు రాజమహేంద్రవరం వేదిక అయింది. ఈ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి అన్నగారు అభిమానులు భారీగా పోటెత్తారు. మరోవైపు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు పసుపు   శోభను సంతరించుని బంతిపూల వనంలా మారాయి. ఇక ఇటు మీడియాలో... అటు సోషల్ మీడియాలో రాజమహేంద్రవరంలో మహానాడు.. రాజమహేంద్రవరంలో మహానాడు అంటూ.... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణతోపాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

 తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా జరుపుకొంటున్న మహానాడు.. పార్టీ శ్రేణులకు ఓ పర్వదినం. అదే విధంగా తెలుగు తమ్ముళ్లకు అత్యంత ఆత్మీయమైన రోజు. అంతే కాదు.. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ మహానాడు తెలుగుజాతీ యావత్తుకు పెద్ పండుగ.  అసలు అలాంటి రోజుకు.. మహానాడు అనే పేరు అసలు ఎలా వచ్చింది. అలాగే ఈ మహానాడును తెలుగుదేశం పార్టీ మే నెల చివరి రోజుల్లోనే ఎందుకు జరుపుకొంటుంది. అయినా మహానాడు అంటే అర్థం ఏమిటి?.. ఇంతకీ మహానాడు అనే పేరు ఎవరు,ఎందుకు పెట్టారనే అంశాలను తెలుసుకునేందుకు రాజమహేంద్రవరంలో మహానాడు జరుగుతోన్న వేళ ప్రజలు గుగూల్‌ను ఆశ్రయిస్తున్నారు.  

వెండితెర కథనాయకుడిగా ఓ వెలుగు వెలుగుతోన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.. 1982, మార్చి 29వ తేదీ హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తొమ్మిది నెలలకే జరిగిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. దీంతో అప్పటి వరకు రాష్ట్రంలో అప్రపతీహతంగా సాగుతోన్న కాంగ్రెస్  పాలనకు అన్న ఎన్టీఆర్ చెక్ పెట్టినట్లు అయింది. 

మరోవైపు టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. పార్టీ జెండా, గుర్తు, పథకాల రూపకల్పన తదితర అంశాలపై వాడివేడిగా చర్చోపచర్చలు జరుగుతోన్న వేళ.. పార్టీలోని ఇతర నాయకుల అభిప్రాయాలను సైతం ఎన్టీఆర్ స్వీకరించారు. ఆ క్రమంలో 1982, ఏప్రిల్ 11వ తేదీన పార్టీ విధి విధానాలు, ఆశయాలను ప్రజల్లోకి బలంగాతీసుకు వెళ్లేందుకు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. అందులోభాగంగా ఈ సభకు ఏ పేరు పెడితే బాగుంటుందంటూ చర్చ జరుగుతోండగా.. మహానాడు పేరు పెడదామని ఎన్టీఆర్ సూచించడంతో.. ఆయన సూచనకు అందరు హ్యాట్సాఫ్ చెప్పారు. కానీ 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలిచి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మే 28న  గుంటూరులో నిర్వహించిన సభ నే  తొలి మహానాడుగా పేర్కొనడం విశేషం. 


అయితే టీడీపీ అగ్రశేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్త వరకు అందరూ కూడా మహానాడుకి అధిక ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సభ ప్రాంగణం వేదికగా అంతా కలసి తీర్మానాలు ఆమోదించుకోవడం... పార్టీ ప్రారంభమైన నాటి నుంచి ఓ ఆచారంగా వస్తుందన్న విషయం విధితమే. అలాగే ఇదే వేదికగా పార్టీ అధ్యక్షులను సైతం ఎన్నుకొవడం మరో విశేషం. అలాగే పార్టీ చేపట్టే భవిష్యత్తు కార్యాచరణను సైతం ఇదే మహానాడు వేదికగా ప్రకటిస్తూ పార్టీ అధినేతలు వస్తున్నారు.  

మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా మహానాడును మే 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అంటే మే 28వ తేదీ ఎన్టీఆర్ జన్మదినం. ఈ నేపథ్యంలో ఆయన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. అలాగే ఆయన జన్మదినం మరునాడు నిర్వహిస్తు వస్తున్నది.. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి, అలాగే 2020, 2021 కరోనా నేపథ్యంలో మహానాడు ప్రజల మధ్య జరుపుకోలేదు. ఈ మహానాడును ఆన్‌లైన్‌లో జరుపుకోవడం విశేషం. మరోవైపు కరోనా నేపథ్యంలో మహానాడును మూడు రోజుల నుంచి రెండు రోజులకు కుదించారు. 

ఇక 2022, మే 27న ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడు సూపర్ డూపర్ హిట్ అయింది. టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు కావడంతోపాటు ఎన్టీఆర్ 99వ జయంతి   కూడా ఇదే మహానాడు వేదికగా జరగడం మహావిశేషం.  


తెలుగుదేశం పార్టీ స్థాపించిన 41 ఏళ్లు అయినా.. కొన్ని సార్లు మహానాడు జరుపుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇక మహా అంటే మొత్తం సమీకరణ, గంభీరం అని అర్థాలు సూచిస్తుంది. దీంతో మహానాడు అంటే.. అందరికీ కలుపుకొని పోయే రోజుగా భావిస్తున్నారు. అదీకాక పార్టీ స్థాపించిన తొలినాళ్లలో మహనాడు ఒక రోజే నిర్వహించే వారు. కానీ ఈ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావడం.. వారిందరిని మాట్లాడించడం కోసం.. సమయం చాలకపోవడంతో.. ఆ తర్వాత ఒక రోజును..  రెండు రోజులకు. అలాగే రెండు రోజులను మూడు రోజులకు  పొడిగించారు. కానీ కరోనా నేపథ్యంలో మహానాడు రెండు రోజులకే పరిమితం చేస్తున్నట్లు ఒంగోలులో జరిగిన మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే. ఏదీ ఏమైనా అన్న నందమూరి తారక రామారావు చేతుల మీదగా.. ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ అన్న గారి చిరు నవ్వులా... నిత్యం వెలుగుతూ.. సమాజమే నా దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అన్నట్లుగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవలో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తి అన్నగారి నిత్య సత్యాస్పూర్తితో ముందుకు కదం తొక్కుతోంది.

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.