Publish Date:Mar 27, 2025
విదేశాలకు వలస వెళ్లడం అంత ఆష మాషి కాదు. స్వంత గూడు వదిలి విదేశాల్లో స్థిరపడాలనుకోవడం అంత మామూలు విషయం కాదు. భారత్ లో మిత వాద రాజకీయాలు, విభజించి పాలించే రాజకీయాలు దేశంలోని అత్యంత సంపన్నులు విదేశాల్లో సెటిల్ కావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఓ వైపు పన్నుల ఒత్తిడి , రాజకీయ కక్ష్య సాధింపు చర్యల కారణంగా మనదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైంది. వేలాది మంది కోటీశ్వరులు దేశ సరిహద్దులు దాటి పర్మినెంట్ గా విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించి కొటక్ ప్రయివేటు ఈవై సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఈ వివరాలను వెల్లడించింది. మనదేశంలోని జీవన ప్రమాణాలతో పోలిస్తే విదేశాల్లో మెరుగ్గా ఉండటంతో అక్కడ స్థిరపడాలనుకుంటున్నారు. ప్రతీయేడు 25 లక్షల మంది విదేశాలకు ఎగుమతి అవుతున్నారు. పిల్లా పాపలతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కరోనా మహమ్మారి తర్వాత ఎక్కువైంది. స్వాతంత్రానికి పూర్వం కూడా మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే సంస్కృతి ఉంది. అనేక నియమ నిబంధనలతో బాటు ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే విదేశాలకు వెళ్లే వారు. ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులే విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా, బ్రిటన్, కెనెడా దేశాలతో పోలిస్తే అరబ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. విదేశాల్లో పెట్టు బడులు పెట్టి వ్యాపారం చేసే సంస్కృతి వెళ్లూనుకుంది. సూపర్ రిచ్ ఇండియన్స్ కు గోల్డెన్ వీసా రావడం వల్ల పెద్దగా కష్టపడకుండానే విదేశాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. గోల్డెన్ విసా అందుకున్న వారిలో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ఒకరు. సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్లాలనుకున్న రజనీకాంత్ కి యునైటెడ్ అరబ్ ఎమ్మిరేట్స్ గోల్డెన్ విసా ఇవ్వడంతో తమ అభిమాన నటుడు భారత్ ను వదిలేస్తారా అని అభిమానులు ఆందోళన చెందారు. గోల్డెన్ విసా జాబితాలో చిరంజీవి, షారూఖ్ ఖాన్, సానియా మిర్జా, అల్లు అర్జున్ , త్రిష, మోహన్ లాల్ , మమ్ముట్టి తదితరులు ఉన్నారు. 2019లో గోల్డెన్ విసాను కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అత్యంత ధనవంతులకు శాశ్వత నివాస విసా అని చెప్పొచ్చు. కళాకారులకే ఉద్దేశించి గోల్డెన్ విసా ఇప్పుడు కళాకారులకు అతీతంగా సూపర్ రిచ్ ఇండియన్స్ కు వరప్రదాయినిగా మారింది. సంపన్నులు దేశం విడిచి వెళ్లిపోవటం అంటే మూలధనం తరలిపోయినట్టు అని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. విదేశాలకు వెళ్లడం అంటే ఫ్యూచర్ ఇన్వెస్టిమెంట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక భారతీయుడు విదేశాలకు వెళ్లాలంటే రెండున్నరకోట్ల రూపాయలు తీసుకెళ్లాలి. అదే ప్రవాస భా రతీయుడైతే ఏకంగా పది కోట్ల వరకు తీసుకెళ్లవచ్చు. దీనివల్ల మన దేశంలో పెట్టు బడులు పెట్టే వారి సంఖ్య తగ్గి అభివృద్ది సూచికపై ప్రభావం పడుతుంది. నిరుద్యోగ సమస్య తాండవం చేసే అవకాశం లేకపోలేదు. మన దేశ సంపద తగ్గి విదేశాలకు సంపదను తరలించినట్టు అవుతుంది. ఒక వ్యక్తి నివాసం మారితే సంపద మారినట్టు కాదని కొటక్ మహీంద్రా ప్రెసిడెంట్ గౌతమి గవాంకర్ చెబుతున్నప్పటికీ ఆర్థిక నిపుణులు మాత్రం ఈ అభిప్రాయానికి ఏకీ భవించడం లేదు. 2023లో అల్ట్రా ఎన్ హెచ్ ఐలు 2. 83 లక్షల మంది ఉంటే వీరి సంపద విలువ నికరంగా రూ 283 కోట్లు ఉంది. 2028 వరకు వీరి సంఖ్య 4.3 లక్షలకు చేరుతుంది. వీరి సంపద రూ. 359 లక్షల కోట్లకు చేరొచ్చని సర్వే వెల్లడించింది. సర్వేలో 66.66 శాతం మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వీళ్లంతా తాము విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తికనబరిచిన వారే కావడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/one-of-the-five-richest-people-has-moved-abroad-39-195094.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.