తెలంగాణలో కొనసాగుతున్నరెండో రోజు గ్రామసభలు... రెస్పాన్స్ ఇదే
Publish Date:Jan 22, 2025
Advertisement
తెలంగాణలో రెండో రోజు గ్రామసభలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడానికి అర్హులైన లబ్దిదారుల కోసం రేవంత్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. గ్రామ సభలు నిర్వహిస్తోంది. బుధవారం రెండో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నాలుగు పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక జరుగనుంది. ఈ నెల 24 వతేదీ డెడ్ లైన్ గా నిర్ణయించారు. అయితే గ్రేటర్ హైద్రాబాద్ లో ఇంకా వార్డు సభలు మొదలు కాలేదు. సర్వే పూర్తయిన తర్వాత వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వార్డు సభలు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది.
http://www.teluguone.com/news/content/on-the-second-day-of-ongoing-gram-sabhas-in-telangana-this-is-the-response-25-191675.html





