బిడ్డల క్షేమం కోసం బరువు తగ్గాల్సిందే

Publish Date:Oct 14, 2016

Advertisement

 

ఊబకాయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మారిపోతున్న జీవనశైలితోనూ, అదుపులేని ఆహారంతోనూ... ఇప్పుడు ఎవరిని కదిపినా ఊబకాయం గురంచి గంటల తరబడి చెప్పేయగలరు. దాంతో పాటుగా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కూడా అందరికీ తెలిసిందే! కానీ గర్భం దాల్చే సమయానికి తల్లి కనుక ఊబకాయంతో బాధపడుతుంటే... అది వారికి పుట్టబోయే పిల్లలను జీవితాంతం వేధిస్తుందని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి.

 

ఒకటి కాదు రెండు కాదు

Lancet Diabetes and Endocrinology అనే పత్రికలో ఈ వారం ఏకంగా నాలుగు పత్రాలు ప్రచురితం అయ్యాయి. ఇవన్నీ కూడా జన్మనిచ్చే తల్లి ఊబకాయం వల్ల పిల్లలకు ఎలాంటి హాని ఏర్పడతాయో చర్చించినవే! ఊబకాయం వల్ల తల్లిలో రక్తపోటు, చక్కెర స్థాయిలు అదుపుతప్పే అవకాశం ఉంది. ఇలా అదుపు తప్పిన అనారోగ్యం వలన ఒకోసారి కడుపులోని బిడ్డ ప్రాణానికే హాని ఉంటుందంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎలాగొలా బిడ్డ క్షేమంగా బయటపడినా, తరువాత కాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. బిడ్డ కడుపులో ఉండగా ఆమె మెదడు సరైన రీతిలో ఎదిగేందుకు అనేక పోషకాలు, హార్మోనులూ అవసరం అవుతాయి. తల్లి కనుక ఊబకాయంతో ఉంటే వీటి సరఫరా అస్తవ్యస్తంగా మారిపోతుందట. ఫలితం! పిల్లవాడిలో ఆటిజం మొదలుకొని పక్షవాతం వరకు... మెదడుకి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

 

ఇది ఒక విషవలయం

అధిక బరువుతో ఉన్న తల్లికి పుట్టే బిడ్డలు కూడా రానురానూ ఊబకాయానికి లోనయ్యే ప్రమాదం ఉందట. దీంతో ఇది ఒక విషవలయంగా మారిపోనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలా మరో పది సంవత్సరాలలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఊబకాయంతో బాధపడే పరిస్థితి రానున్నదని ఊహిస్తున్నారు. ఇలాంటి వారికి పుట్టే పిల్లలలో ఆస్తమా మొదలుకొని క్యాన్సర్‌ వరకూ ఎలాంటి సమస్య అయినా తలెత్తవచ్చట.

 

ముందు జాగ్రత్త

పిల్లల్ని కనాలన్న ఆలోచన ఉన్న స్త్రీలు ముందుగా తమ బరువు మీద దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ముందుగా తమ బరువుని తగ్గించుకోవాలి. అవసరమైతే ఇందుకోసం వైద్యుని సలహా సంప్రదింపులను పాటించేందుకు ఏమాత్రం జంకాల్సిన పనిలేదు. గర్భం దాల్చిన తరువాత కూడా ఎప్పటికప్పుడు తమ బరువు, రక్తపోటు, షుగర్‌ నిల్వలు పరిధిలో ఉన్నాయా లేదా అన్నది తరచి చూసుకుంటూ ఉండాలి.

 

పిల్లల అనారోగ్యం మీద తల్లి ఊబకాయమే కాదు, తండ్రి బరువు కూడా ప్రభావం చూపుతుందని ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది. కాబట్టి తల్లిగా మారాలనుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, తండ్రి కావాలని ఆశపడేవారు కూడా తమ ఆరోగ్యం పట్ల అంతే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

 

- నిర్జర.

By
en-us Political News

  
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.