Publish Date:Oct 20, 2022
పిల్లల్ని నర్సరీల్లో చేర్చడం ఈరోజుల్లో పరిపాటి. తల్లి ఉద్యోగరీత్యానో, పనుల ఒత్తిడివల్లనో సమయానికి పిల్లల్లి చూసుకోలేని పరిస్థితుల్లోనూ నర్సరీలో చేరుస్తున్నారు. వారికి చిన్నపాటి ఆటపాటలతో సరదాగా అక్కడివారు జాగ్రతగానూ చూసుకుంటుంటారు. అలాగని వదిలేసి ధైర్యంగా తల్లులు ఉండలేరు. ఏదో ఒక భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టు, ఇంట్లోవారు కనిపెట్టుకున్నట్టు అక్కడ కుదరదు గదా. చాలామంది పిల్లల్లో మన పిల్లవాడు! కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు, ఏడుస్తారు, నానా రభసా ఉంటుందక్కడ. నర్సరీ క్లాసులు చూసుకునే టీచర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి పొర పాటు కూడా పిల్లలకు ప్రమాదకరంగా మారవచ్చు. ఇదుగో యార్క్షైర్లో అలాంటి చిన్నప్రమాదమే జరిగింది.
ఏడిది పిల్లాడు జాక్. అతన్ని తన తల్లి దగ్గర్లోని ఒక నర్సరీలో చేర్చింది. వారు నిజానికి బాగానే చూసు కుంటూండేవారు. మొన్ననీ ఒక నర్సు చేసిన తప్పిదంతో పిల్లాడికి దాదాపు కన్నుపోయే ప్రమాదం వచ్చిపడింది. అందరూ ఆస్పత్రికి పరిగెత్తారు. అదృష్టవశాత్తూ కంటికి ఏమీ కాలేదు. ఫస్ట్స్టెప్స్ అనే నర్సరీలో పిల్లలంతా ఆడుతున్నారు. అక్కడ వాళ్ల సంరక్షకురాలు చక్కగా గోళ్ల అందం చూసుకుం టోంది. ఈమధ్య నకిలీ గోళ్లు కూడా వచ్చాయి. వాటిని పెట్టుకుంటోంది. అంతలో ఎటునించి వెళ్లాడో జాక్ ఆమె దగ్గరికి వెళ్లాడు. ఆమె తయారుచేసుకున్న జిగురులాంటి పదార్ధం గిన్నెలో అమాంతం చేయి పెట్టాడు. అది చూసి ఆ నర్సు వాడి చెయ్యి పట్టుకునేలోగానే వాడు లాగేసరికి అది కళ్లకి తగిలి కుడికన్ను వెంటనే ఎర్రగా అయి వాచింది. ఈమె భయంతో ఒణికింది. ఓర్నాయనో ఏదో అయ్యిందిరా అని. ఒక్క పొలికేక పెట్టింది.
వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసికెళితే పరీక్షచేసిన డాక్టర్లు మరేం ఫరవాలేదు కంటికేమీ కాలేదని చెప్పారు. రెండు రోజులు జాగ్రత్తగా చూసుకోమని జాక్ తల్లిదండ్రులకు చెప్పారు. ఆ నర్సరీ స్కూలు యాజమాన్యం ఆ నర్సుని తిట్టి బయటకి పంపేసింది. అంచేత.. పిల్లల్ని నర్సరీకి పంపామని మరీ ధైర్యం గా ఉండకండి.. అక్కడి పరిస్థితులు వాకబు చేస్తుండండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nursery-accidentchild-rescued-from-eye-problem-25-145738.html
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.