Publish Date:Mar 25, 2026
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డిని 2024 ఎన్నికల తరువాత నుంచీ నెటిజనులు లెవన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చేరింది. కారణం తెలిసిందే కదా.. 2024 ఎన్నికలలో ఆయన పార్టీ సాధించిన స్థానాల సంఖ్య 11 కావడంతో ఆ సంఖ్య పేరుతోనే వైసీపీ అధినేతనూ, ఆ పార్టీని నెటిజనులు ఓ ఆటాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీయులకు నంబర్ 11 ఒక పీడకలలా తయారైంది. ఇక ఆయన వ్యతిరేకులైతే జగనాసుర, లెవనాసురా అంటూ కూడా ఎద్దేవా చేస్తుండటం కద్దు.
అంతే కాదు జగన్ తన ఎమ్మెల్యేలతో ఇలా అసెంబ్లీకి హాజరై అలా వాకౌట్ చేసిన సందర్భంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు 11-11-11 అంటూ కామెంట్ చేశారు. పదకొండు మంది ఎమ్మెల్యేలతో వచ్చిన జగన్ 11 నిమిషాల 11 సెకన్లు మాత్రమే ఉండి వెళ్లడంతోనే స్పీకర్ ఈ కామెంట్ చేశారు. అలాగే గతంలో ఓసినిమా ఫంక్షన్ లో నటుడు పృధ్వీ పదకొండు గొర్రెలు అంటూ చేసిన కామెంట్ వైసీపీయులు జీర్ణించుకోలేకపోయారు. ఇందుకు కారణం 11 అన్న సంఖ్య అంటే జగన్ కు, ఆయన పార్టీ శ్రేణులకూ గిట్టదు.గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా.. వైసీపీయులకు 11 నంబర్ కనిపించినా, వినిపించినా జగన్ ను ఉద్దేశించే అని ఉలిక్కిపడుతుంటారు. ఉడుక్కుంటుంటారు. అంతెందుకు గతంలో ఆయన జైల్లో ఉన్న కాలాన్ని కూడా పదకొండుకు ముడిపెట్టి నెటిజనులు సెటైర్లు వేస్తున్నారంటే వైసీపీ అండ్ కోను నంబర్ 11 ఎలా వెంటాడుతోందో, ఏడిపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే.. ఆయన చట్టపరంగా ఎదుర్కొంటున్న కేసులలోనూ 11 నంబర్ మేజిక్ చేస్తున్నది. ఎలా అంటే ఇప్పటి వరకూ సీబీఐ ఆయనపై వేసిన ఛార్జి షీట్ల సంఖ్య 11. ఇక ఆ కేసుల్లో ఆయన ఏవన్ నిందితుడు. ఏ అంటే న్యూమరాలజీ ప్రకారం ఒకటి. వన్ అంటే ఒకటి. ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టి చూసినా పదకొండే వస్తుందని జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు కూడా. అలాగే అప్పట్లో జగన్ వరుసగా 11 శుక్రవారాలు ర్టుకు హాజరైన సంగతీ ఆయనపై ట్రోలింగ్ కు దోహదపడింది. అంతెందుకు ఇటీవలి కాలం వరకూ వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా 11 ఉండేది. కొందరు రిజైన్ చేయడంతో ఆ సంఖ్యలో మార్పు వచ్చింది. అది వేరే సంగతి. అలాగే జగన్ ఢిల్లీ పర్యటనల్లోనూ, సీట్ల కేటాయింపుల్లోనూ, పదకొండవ నెంబర్ ఆయన్ను వదల కుండా వెంటాడింది. వెంటాడుతోంది.
జగన్ లెవన్ పై మీమ్స్ గురించి చెప్పనక్కర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవన్ లాగా.. జగన్స్ లెవన్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే. పార్లమెంటులో మొదటి అంతస్తులోని 11వ నంబర్ రూమ్ ను స్పీకర్ కేటాయించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన వైసీపీ ఎంపీలు ఆ రూమ్ ను ఆక్యుపై చేయడానికి నిరాకరించారు. మూకుమ్మడిగా స్పీకర్ ను కలిసిన వారు ఆ రూమ్ తమకు వద్దనీ, మరో రూమ్ కేటాయించాలంటూ కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకున్నారు. వారి వినతులను మన్నించి స్పీకర్ వారికి 11వ నంబర్ రూమ్ ను మార్చి 12వ నెంబర్ రూమ్ ను కేటాయించారు. దీంతో 11 నంబర్ జగన్ ను వదల బొమ్మాలీ నిన్నొదల అన్నట్లు వెంటాడుతోందని నెటిజనులు నెట్టింట సెటైర్లు గుప్పిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/number-11-haunting-jagan-39-216108.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.