Publish Date:May 28, 2022
ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ తనయుడు, హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాల కృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి శత జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిమ్మకూరులో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు వాడి, వేడిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తెలుగు భాష ఉన్నంత వరకూ ప్రతి తెలుగువాడి గుండెల్లో చరస్థాయిగా నిలిచిపోతారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ ఆశీస్సులు సదా ఉంటాయన్నారు. కాగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ తనయ, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తండ్రికి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించనున్నారని చెప్పారు. ఈ విషయమై కేంద్ర రిజర్వ్ బ్యాంకుతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది మే వరకూ నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలోని 12 కేంద్రాలలో నిర్వహిచే ఉత్సవాల కోసం బాలకృష్ణ, కె. రాఘవేంద్రరావు వంటి ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిపుణులను సత్కరించనున్నట్లు పురంధేశ్వరి తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ntr-jayanthi-in-nimmakur-39-136565.html
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.