ప్రజల గుండెల్లో కొలువున్న పెద్దన్నకు 90 ఏళ్ళు

Publish Date:May 28, 2013

Advertisement

 

తెలుగు చిత్ర సీమకి, తెలుగు జాతికి, రాష్ట్ర రాజకీయాలకి పెద్దన్నగా అరుదయిన గౌరవం స్వంతం చేసుకొన్నస్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 90వ జయంతి నేడు. తీయనయిన తెలుగుకు పర్యాయపదంగా, తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా నిలచిన యన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వితంగా కొలువయ్యుంటారు.

 

యన్టీఆర్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923, మే 28న జన్మించారు. 1949లో ‘మన దేశం’ అనే సినిమాతో చిత్ర సీమలోకి ప్రవేశించిన యన్టీఆర్ చివరిగా 1993లో ‘శ్రీనాథ కవిసార్వభౌమ’తో తన 43 ఏళ్ల సుదీర్గ సినీ ప్రస్థానం ముగించారు. ఈ సుదీర్గ యాత్రలో ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తన బహుముఖ ప్రజ్ఞ కనబరిచి ప్రజల మెప్పు పొందారు.అనేక విశిష్ట గౌరవ పురస్కారాలను కూడా అందుకొన్నారు.

 

ఆయన మొత్తం 320 సినిమాలలో నటించారు. అంతే కాకుండా దేశంలో మరే ఇతర నటుడు చేయలేనన్ని విభిన్న పాత్రలు పోషించారు. ఆయన చేసిన సినిమాలలో ఎక్కువ సాంఘిక చిత్రాలే అయినప్పటికీ, ఆయనకు ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టినవి మాత్రం ఆయన చేసిన పౌరాణిక సినిమాలేనని చెప్పవచ్చును. అలాగని ఆయన చేసిన కన్యాశుల్కంలో గిరీశం పాత్రను, రాముడు భీముడు సినిమాలో భీముడి పాత్రను, బడిపంతులు సినిమాలో బడిపంతులు పాత్రను తెలుగు ప్రజలు ఎవరూ ఎన్నటికీ మరిచిపోలేరు.

 

ఇక పౌరాణికాల్లో ఆయన చేసిన శ్రీకృష్ణుని పాత్ర గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 27 ఏళ్లలో నిర్మించిన 25పౌరాణిక సినిమాలలో ఆయన శ్రీకృష్ణుని పాత్ర పోషించారు. శ్రీకృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అని ప్రజలు కూడా నమ్మేంతగా ఆయన ఆ పాత్రను పండించారు. రావణుడు, దుర్యోధనుడు వంటి దుష్టపాత్రలకు కూడా తన అభినయంతో ప్రాణ ప్రతిష్ట చేసి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనకే చెల్లు.

 

కేవలం ద్విపాత్రాభినయం చేయడమే గొప్ప అనుకొంటున్న సమయంలో దాన వీర శూర కర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రలు పోషించి ప్రజల చేత జేజేలందుకొన్నారాయన. ఇక, విజయవంతమయిన నిర్మాతగా, ప్రతిభగల దర్శకుడిగా, కధకుడిగా తెలుగు చిత్ర సీమలో ఆయన విజయకేతనం ఎగురవేశారు.

 

ఆయన నటించిన సినిమాలలో150కి పైగా శతదినోత్సవాలు, 50కి పైగా రజతోత్సవాలు, 7 స్వర్ణోత్సవాలు జరుపుకొన్నాయి. ఆయన మన దేశంలోనే తొలి వంద, రెండు వందల చిత్రాలు చేసిన హీరోగా, తొలి మూడొందల చిత్రాలు చేసిన తొలి తెలుగు హీరోగా నెలకొల్పిన రికార్డును ఇంతవరకు ఎవరూ అధిగమించలేకపోయారు. ఆయన తన స్వీయ దర్శకత్వంలో 18 సినిమాలలో నటించడమే కాకుండా వాటిలో అనేక సినిమాలు శతదినోత్సవాలు కూడా జరుపుకొన్నాయి.

 

ఒకవైపు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తూనే, మరో వైపు సినిమాలలో నటించిన ఘనత కూడా ఆయనకే చెల్లింది. ఆయన ప్రతిభకు పట్టం కడుతూ అనేక అవార్డులు, సన్మానాలు పొందారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమయిన పద్మశ్రీ అవార్డును 1968లోనే ఇవ్వడం జరిగింది. అయితే, చిత్రసీమకి ఇంతగా సేవలందించిన ఆయనకి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు దక్కలేదనే భావన తెలుగు ప్రజలలో ఉంది. అందుకే ఆయనకు ప్రతిష్టాత్మకమయిన ‘భారత రత్న’బిరుదు ఇవ్వాలని ప్రజలు కోరుకొంటున్నారు. ఇటీవలే ఆయన విగ్రహం పార్లమెంటులో అవిష్కరింపబడటం యావత్ తెలుగు జాతికి గర్వ కారణం.

 

రాష్ట్రంలో ముఖ్యమంత్రులను ఆట బొమ్మలుగా చేసి ఆడుకొంటున్న కాంగ్రెస్ పార్టీ పద్ధతి చూసి చాలా బాధ పడిన ఆయన తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9నెలలలోనే ఆయన తిరుగులేని మెజార్టీతో రాష్ట్రంలో తొట్టతొలి కాంగ్రెసేతర ప్రభుత్వం నెలకొల్పారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన ఆయన రాజకీయాలను, అధికార పద్దతులను పక్కన బెట్టి తన అంతరాత్మకే ఎక్కువ ప్రాదాన్యమిస్తూ ప్రజల సమస్యలకు మనసుతో స్పందిస్తూ పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు.

 

బహుశః ఆ కారణంగానే, టంగుటూరి ప్రకాశం పంతులు గారి తరువాత ఇంతవరకు మరే ముఖ్యమంత్రి ప్రజలకి చేరువకానంతగా ఆయన చేరువకాగలిగారు. కానీ, ఆయనలో రాజకీయాలకు అసలు నప్పని నిరాడంబరత, అధికారం దర్పం, రాజకీయాలు పక్కన బెట్టి మనసుతో స్పందించే తీరు, కపటమెరుగని భోళతనం, ముక్కు సూటితనం వంటి లక్షణాలే ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి అత్యంత విషాదకర ముగింపునిచ్చాయని మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన 1996, జనవరి 18న గుండె పోటుతో మరణించారు. అయినప్పటికీ ఆయన తెలుగు చిత్ర సీమకు, తెలుగుజాతికి చేసిన మహోపకారం వల్ల ‘తెలుగు’ పదం సజీవంగా ఉన్నంతవరకూ ఆయన కూడా తెలుగు ప్రజల హృదయాలలో సజీవుడిగానే ఉంటారు. .

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.