Publish Date:Feb 11, 2025
ఢిల్లీ పరాజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందా? ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో కూడా అధికారం చేజారిపోతోందా? పంజాబ్ లోని భగవంత్ మాన్ సర్కార్ కుప్పకూలిపోవడానికి రంగం సిద్ధమైందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. పంజాబ్ లో ఆప్ పుట్టి మునగడానికి అవసరమైన ప్రయత్నాలను బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఔను మీరు చదివినది నిజమే.. పంజాబ్ లో ఆప్ సర్కార్ కు కాంగ్రెస్ నుంచే ముప్పు పొంచి ఉంది.
ఇప్పటికే పంజాబ్ లోని భగవంత్ సింగ్ మాన్ సర్కార్ పట్ల ప్రజలలో అసంతృప్తి ఓ రెంజ్ లో ఉంది. పార్టీ నేతలూ, క్యాడర్ లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఢిల్లీ ఎన్నికలలో ఓటమి ప్రభావం పంజాబ్ అప్ లోని అసమ్మతీయులకు ఊతం ఇచ్చింది. పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆప్ అధినేత కేజ్రీవాల్ నష్టనివారణ చర్యలకు నడుంబిగించారు. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం మంగళవారం (ఫిబ్రవరి 11)న జరగనుంది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. అన్ని పనులూ మానుకుని అందరూ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు.దీంతో పంజాబ్ లో ఆప్ సర్కార్ భవిష్యత్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో ఆప్ ఓటమి తరువాత పంజాబ్ లో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లోకి వచ్చారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
దీంతో పంజాబ్ ఆప్ లో కంగారు మొదలైంది. కేజ్రీవాల్ హడావుడిగా ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అధికారిక నివాసంలో జరుగుతోంది. వాస్తవానికి పంజాబ్ కేబినెట్ సమావేశం సోమవారం (ఫిబ్రవరి 10) జరగాల్సి ఉంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. ఆ వెంటనే పార్టీ అధినేత కేజ్రీవాల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పంజాబ్ ఆప్ లో ఏదో జరుగుతోందనీ, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎలా అన్నదానిపై ఆప్ అగ్రనేతలు మల్లగుల్లాలు పడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-troubles-to-aap-in-punjab-39-192696.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.