Publish Date:Feb 11, 2025
ఢిల్లీ పరాజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందా? ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో కూడా అధికారం చేజారిపోతోందా? పంజాబ్ లోని భగవంత్ మాన్ సర్కార్ కుప్పకూలిపోవడానికి రంగం సిద్ధమైందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. పంజాబ్ లో ఆప్ పుట్టి మునగడానికి అవసరమైన ప్రయత్నాలను బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఔను మీరు చదివినది నిజమే.. పంజాబ్ లో ఆప్ సర్కార్ కు కాంగ్రెస్ నుంచే ముప్పు పొంచి ఉంది.
ఇప్పటికే పంజాబ్ లోని భగవంత్ సింగ్ మాన్ సర్కార్ పట్ల ప్రజలలో అసంతృప్తి ఓ రెంజ్ లో ఉంది. పార్టీ నేతలూ, క్యాడర్ లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఢిల్లీ ఎన్నికలలో ఓటమి ప్రభావం పంజాబ్ అప్ లోని అసమ్మతీయులకు ఊతం ఇచ్చింది. పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆప్ అధినేత కేజ్రీవాల్ నష్టనివారణ చర్యలకు నడుంబిగించారు. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం మంగళవారం (ఫిబ్రవరి 11)న జరగనుంది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. అన్ని పనులూ మానుకుని అందరూ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు.దీంతో పంజాబ్ లో ఆప్ సర్కార్ భవిష్యత్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో ఆప్ ఓటమి తరువాత పంజాబ్ లో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లోకి వచ్చారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
దీంతో పంజాబ్ ఆప్ లో కంగారు మొదలైంది. కేజ్రీవాల్ హడావుడిగా ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అధికారిక నివాసంలో జరుగుతోంది. వాస్తవానికి పంజాబ్ కేబినెట్ సమావేశం సోమవారం (ఫిబ్రవరి 10) జరగాల్సి ఉంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. ఆ వెంటనే పార్టీ అధినేత కేజ్రీవాల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పంజాబ్ ఆప్ లో ఏదో జరుగుతోందనీ, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎలా అన్నదానిపై ఆప్ అగ్రనేతలు మల్లగుల్లాలు పడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-troubles-to-aap-in-punjab-39-192696.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది