2015లో మొదలైన ఓటుకు నోటు కేసు తెలంగాణ రాజకీయాలనే మలుపు తిప్పిందంటే అతిశయోక్తి కాదేమో. ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ వివాదంలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు గొప్ప పదవులను కట్టబెట్టింది. ఇది నిజంగా ఒక విచిత్ర రాజకీయ పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక వివరాల్లోకి అంటే.. 2015 కి వెళ్తే.. నాడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తూ అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆ ఎన్నికల్లోతెలుగుదేశం అభ్యర్థిగా నిలిచింది మరెవరో కాదు.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. అప్పట్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో స్టీఫెన్ సన్ నివాసంలో రేవంత్ ఉన్న దృశ్యాలు, ఆడియో టేపులు.. బ్రీఫ్డ్ మీ వంటి పోన్ సంభాషణలు పెను ప్రకంపనలు పుట్టించాయి.
ఈ ప్రకంపనలు ఎంత మేలు చేశాయంటే.. రేవంత్ రెడ్డి ఆ కేసు విషయంలో అరెస్టు కాగా.. అది ఆయనలో ఎలాగైనా సరే కేసీఆర్ పీచమణచాలన్న కృతనిశ్చయం వచ్చేలా చేసింది. దానికి తోడు ఆయన తన కుమార్తె వివాహ సమయంలో ఈ అరెస్టు కావడంతో ఆ కసి రెట్టింపు అయ్యింది. కేసీఆర్ నీ అంతు నా చేతుల ద్వారానే జరుగుతుంది చూసుకో! అంటూ ఆయన జైలు నుంచి విడుదలైన టైంలో చేసిన ప్రసంగాలు, పిడికిలి బిగించి చేసిన సంజ్ఞలు తెలంగాణ రాజకీయాల్లోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత కాలంలో.. ఆ కసీ క్రోధమే రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
ఈ కేసు రేవంత్, వేం నరేందర్ రెడ్డి.. ఇద్దరినీ ఒకరికొకరు నమ్మకమైన స్నేహితులుగా మార్చేసింది. ఇరువురూ తమ కష్టనష్టాల్లో పాల్పంచుకున్నారు. ఒకరి శ్రేయస్సే మరొకరిగా భావించచారు. ఇప్పుడు చూస్తే వారి మధ్య ఆ గాఢానుబంధం.. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్నేహ అధ్యాయాన్ని లిఖించింది. దీంతో పాటు ఈ కేసు ద్వారా జరిగిన మరో విషయమేంటంటే.. ఏమిటంటే చంద్రబాబు హైదరాబాద్ రాజధానిగా పదేళ్లు ఉండటానికి హక్కున్నా దాన్ని వదులుకుని అమరావతి వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ ప్రజలకు అత్యంత దగ్గరగా మసులుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.
ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే.. చెడు జరిగిందని.. ఇక అక్కడితో అయిపోయిందని భావించకూడదు. ఒక చెడు మరో మంచికే అని భావించి ముందడుగు వేయాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/note-for-vore-case-39-215096.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.