Publish Date:Aug 27, 2022
పిల్లలకి పాకడం రావడం ఆలస్యం ఇల్లంతా తిరిగేస్తుంటారు. వారికి అదో ఆట. ఇల్లంతా కలియ తిరగ డానికి ప్రయత్నిస్తుంటా. కానీ అంత శుభ్రంగా ఉందీ లేనిదీ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి పిల్లల్ని అలా ఇల్లంతా పాకనీయరు. ఓ క్షణం తర్వాత ఎత్తుకుంటారు. కానీ కొత్తగా నేర్చిన ఆట ఎప్పుడూ పసం దుగానే ఉంటుంది.. పిల్లలకీ అంతే. మాటలు రావు గనుక చేత్తులతో ఎత్తుకున్నవారి మొహాన్ని కొడుతూ కిందకి వదలమంటారు. తల్లిందండ్రులకు, ఇంట్లో పెద్దవారికి అదో ఆనందం. దానికి అంతే ఉండదు.
కానీ ఇలా అమితోత్సాహంతో పిల్లలు మేడ మెట్లు ఎక్కడానికీ ప్రయత్నిస్తుంటారు. ఇది ప్రమాదకరం. అందుకే వెనకాలే తిరుగుతూ మెట్ల వేపు వెళ్లకుండా జాగ్రత్తపడుతుంటారు, జాగ్రత్తపడాలి. నడక వస్తే పట్టుకోవడం మరీకష్టం. ఇంట్లో పిల్లలతో పాటు కుక్కపిల్లనీ అంతే ప్రేమగా చూసుకునేవారు చాలా మందే ఉన్నారు. అది కూడా అలా పాకుతూనో, నడకనేర్చి రెండు అడుగులు వేసే పిల్లలతోనో తిరుగు తూనే ఉంటుంది. దానికి పెద్దవాళ్ల తర్వా త ఇంట్లో హఠాత్తుగా ఈ రాజు, రాకుమారి ఎవరా అని ఆశ్చర్యం.
మెల్లగా ఇంట్లోవారు పిల్లనో, పిల్లాడినో ఎలా చూస్తున్నారన్నది కుక్కపిల్లా గమనిస్తుంది. అదీ అంతే జాగ్ర త్తలు తీసుకుంటుంది. వేగంగా వెళు తుంటే అడ్డుకోవడం, మెట్లు ఎక్కబోతే వారించడమే చేస్తుంది. పిల్ల లు కోపగించి దాన్ని కొడతారు. దానికి దెబ్బే తగలదు కానీ, అడ్డుకోవడం మాత్రం మానదు. పడతారన్న భయం తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో తోడుగా తిరిగే కుక్కపిల్లకీ ఉంటుందేమో!
మీరు చూస్తున్న ఫోటోలో సీన్ అదే. ఆ పసికూన మెట్లెక్కడానికి విశ్వయత్నం చేస్తోంది. ససెమీరా అంగీ కరించని కుక్క అడ్డుకుంటోంది. పిల్లడు ఎక్కి పడితే తల్లిదండ్రులు ఓదార్చి ముద్దెడతారు. కానీ తన్ను లు మాత్రం తనకు తప్పవుకదా! అదీ కారణం కావచ్చు.. అందుకునే అడ్డుకుంటోంది! ఇది ఎక్కడదని కాదు.. ప్రతీ ప్రాంతంలో దాదాపు కుక్కలున్న ప్రతీ ఇంట్లో సీన్ ఇలానే ఉంటుంది. కుక్కలు యజమాని భక్తులు. తిండిపెట్టి పెంచుతున్నారు గనుక, దెబ్బలు తినకూడదుగదా! అందుకునే ఈ రక్షణకు పూనుకుంటుంది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-i-dont-allow-you-25-142754.html
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.