Publish Date:Aug 27, 2022
పిల్లలకి పాకడం రావడం ఆలస్యం ఇల్లంతా తిరిగేస్తుంటారు. వారికి అదో ఆట. ఇల్లంతా కలియ తిరగ డానికి ప్రయత్నిస్తుంటా. కానీ అంత శుభ్రంగా ఉందీ లేనిదీ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి పిల్లల్ని అలా ఇల్లంతా పాకనీయరు. ఓ క్షణం తర్వాత ఎత్తుకుంటారు. కానీ కొత్తగా నేర్చిన ఆట ఎప్పుడూ పసం దుగానే ఉంటుంది.. పిల్లలకీ అంతే. మాటలు రావు గనుక చేత్తులతో ఎత్తుకున్నవారి మొహాన్ని కొడుతూ కిందకి వదలమంటారు. తల్లిందండ్రులకు, ఇంట్లో పెద్దవారికి అదో ఆనందం. దానికి అంతే ఉండదు.
కానీ ఇలా అమితోత్సాహంతో పిల్లలు మేడ మెట్లు ఎక్కడానికీ ప్రయత్నిస్తుంటారు. ఇది ప్రమాదకరం. అందుకే వెనకాలే తిరుగుతూ మెట్ల వేపు వెళ్లకుండా జాగ్రత్తపడుతుంటారు, జాగ్రత్తపడాలి. నడక వస్తే పట్టుకోవడం మరీకష్టం. ఇంట్లో పిల్లలతో పాటు కుక్కపిల్లనీ అంతే ప్రేమగా చూసుకునేవారు చాలా మందే ఉన్నారు. అది కూడా అలా పాకుతూనో, నడకనేర్చి రెండు అడుగులు వేసే పిల్లలతోనో తిరుగు తూనే ఉంటుంది. దానికి పెద్దవాళ్ల తర్వా త ఇంట్లో హఠాత్తుగా ఈ రాజు, రాకుమారి ఎవరా అని ఆశ్చర్యం.
మెల్లగా ఇంట్లోవారు పిల్లనో, పిల్లాడినో ఎలా చూస్తున్నారన్నది కుక్కపిల్లా గమనిస్తుంది. అదీ అంతే జాగ్ర త్తలు తీసుకుంటుంది. వేగంగా వెళు తుంటే అడ్డుకోవడం, మెట్లు ఎక్కబోతే వారించడమే చేస్తుంది. పిల్ల లు కోపగించి దాన్ని కొడతారు. దానికి దెబ్బే తగలదు కానీ, అడ్డుకోవడం మాత్రం మానదు. పడతారన్న భయం తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో తోడుగా తిరిగే కుక్కపిల్లకీ ఉంటుందేమో!
మీరు చూస్తున్న ఫోటోలో సీన్ అదే. ఆ పసికూన మెట్లెక్కడానికి విశ్వయత్నం చేస్తోంది. ససెమీరా అంగీ కరించని కుక్క అడ్డుకుంటోంది. పిల్లడు ఎక్కి పడితే తల్లిదండ్రులు ఓదార్చి ముద్దెడతారు. కానీ తన్ను లు మాత్రం తనకు తప్పవుకదా! అదీ కారణం కావచ్చు.. అందుకునే అడ్డుకుంటోంది! ఇది ఎక్కడదని కాదు.. ప్రతీ ప్రాంతంలో దాదాపు కుక్కలున్న ప్రతీ ఇంట్లో సీన్ ఇలానే ఉంటుంది. కుక్కలు యజమాని భక్తులు. తిండిపెట్టి పెంచుతున్నారు గనుక, దెబ్బలు తినకూడదుగదా! అందుకునే ఈ రక్షణకు పూనుకుంటుంది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-i-dont-allow-you-25-142754.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.