ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌కు స్పందన కరవు.. కేసీఆర్‌ను న‌మ్మ‌ట్లేదా?

Publish Date:Mar 10, 2022

Advertisement

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పేంటి? ఎందుకు ఆయన్ని ఎవరూ నమ్మడం లేదు? హుజురాబాద్’లో ప్రజలు అడిగినవీ, అడగనివీ అన్నీ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి ఇంకేం కావాలని, అడిగి మరీ, ప్రభుత్వ పథకాల పంచారు.  పార్టీ పైసలు కవర్లలో పెట్టి ఇచ్చారు.  నియోజక వర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళిత ఓటర్ల కోసం దళిత బంధు పథకం తెచ్చారు. ఫ్యామిలీకి పది లక్షలు ఎరగా వేశారు. ఇతరులకు, రేషన్ కార్డు మొదలు పెన్షన్ల వరకు చాలా చాలా వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చే పథకాలను, ఒక్క హుజురాబాద్’కే పరిమితం చేసి పందారం చేశారు.  ఓటుకు పదివేలు చొప్పున పంచారు. నిజానిజాలు ఎలా ఉన్నా, పదివేలు ముట్టని మహిళలు వీధుల్లోకి వచ్చి, ‘ఓటు’ పైసల కోసం రోడ్ల్ మీదకు వచ్చి, ధర్నాలు చేశారు. చివరకు, దేశంమొత్తంలో ఇంతవరకు జరిగిన ఎన్నికలు అన్నింటిలోకి అత్యంత ఖరీదైన ఎన్నిక అనిపించే స్థాయిలో డబ్బులు కుమ్మరించారు. ఇంత చేసినా, చివరకు ఫలితం దక్కలేదు. 

అది మొదలు ముఖ్యమంత్రి కేసేఆర్’కు వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయని,   రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా రాష్టంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రజలే కాదు రాజకీయ పార్టీలు, నాయకుల విశ్వాసాన్ని కూడా కోల్పోయారని అంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేద్దామని, దేశాన్ని చుట్టి వస్తున్నారు.ఎంతో మంది నాయకులను కలుస్తున్నారు, అయినా ఒక్కరంటే ఒకక్రు కూడా, ఆయనతో జట్టు కట్టేందుకు సిద్ధంగా లేరని, స్పష్టమవుతోంది. 

అదలా ఉంటే, ఎన్నో ఆశలు పెట్టుకున్న, ‘బాహుబలి’ ఉద్యోగ ప్రకటన కూడా పెద్దగా ఆశించిన ఫలితాన్నిఇవ్వలేదని,తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. జిల్లాలనుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి, తెరాస నేతలు మొక్కుబడి సంబురాలు చేకోవడమేకానీ, ఉత్సాహంగా నిరుద్యోగ యువకులు, విద్యార్ధులు సంబురాలు చేసుకున్నది లేదని, తెలుస్తోంది. ముఖ్యమంత్రి ముందుగానే, పది గంటలకు బ్రహ్మండం బద్దలు అయ్యే ప్రకటన ఉంటుందని ప్రకటించినా, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని, దేమిటో ముందుగానే ఉహించడంతో పాటుగా ప్రకటన వెంక ఉన్న కుట్రను కూడా యువకులు ముందుగానే గుర్తించారని, అందుకే ఎవరూ సీఎం ప్రకటనను సీరియస్’గా తీసుకోలేదని అంటున్నారు.  
అంతే కాకుండా, నిరుద్యోగులను ఎవరిని కదిల్చినా, ముఖ్యమంత్రి భారీ ప్రకటనలు చేయడం ఇదే తొలిసారి కాదు. హుజూర్’నగర్ మొదలు హుజూరాబాద్ వరకు ప్రతి ఎన్నిక, ఉప ఎన్నికముందు, ఇలాంటి ప్రకటనలే చేశారు. కానీ, ముఖ్యమంత్రి ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి, నోటి మాటగానే మిగిలిపోయాయని,అందుకే ముఖ్యమంత్రి ప్రకటనపై నమ్మకం కుదరడం లేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చెప్పి, చివరకు అసలు అలాంటి హమీనే ఇవ్వలేదని అదే అసెంబ్లీ ప్రకటించిన ముఖ్యమంత్రిని నమ్మేదెలా?అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

అందుకే, గత అనుభవాల ఆధారంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా నోటిఫికేషన్లే ఇవ్వదని, ఇచ్చినా ఏదో ఓ వివాదంతో కాలయాపన చేస్తారని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, వరద సాయం… దళిత బంధు తరహాలోనే, మభ్య పెట్టి ఎన్నికలకు వెళ్తారని.., విపక్షాలు అడ్డుకున్నాయని ప్రచారం చేస్తారని అనుమానిస్తున్నారు. అందుకే నిరుద్యోగుల్లో అంత ఉత్సాహం కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే, తెరాస ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య విశ్వసనీయత కోల్పోవడమే అని పరిశీలకులు అంటున్నారు. ఈ నిజాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, ముందస్తుకు వెళ్ళినా ప్రయోజనం ఉందని రాజకీయ పండితులే కాదు, తెరాస సీనియర్ నాయకులు కూడా లోపాయికారీ, చర్చల్లో ఆమోదిస్తున్నారు.
 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.