ఏపీ తలరాత ఇంతే!

Publish Date:Mar 30, 2023

Advertisement

14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరీ హోదా రాష్ట్రాలు, సాధారణ కేటగిరీ రాష్ట్రాల మధ్య వివక్ష చూలేదు కనుకే అందుకే ప్రత్యేక కేటగిరీ హోదా స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేటాయించినట్టు కేంద్ర స్పష్టం చేయడం ఏపీకి ఏవిధంగా నైనా షాకింగ్ న్యూస్ కాదు.. గత కొన్నేళ్లుగా కేంద్ర చెబుతునన మాట ఇదే. మరో సారి 

ఇదే విషయాన్ని రాజ్య సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు  విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. కేంద్ర ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవాలన్న ఫైనాన్స్ కమిషన్ సీఫారుసుల మేరకు 2015-20 మధ్య కాలంలో రాష్ట్రాల వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగిందని మంత్రి సెలవిచ్చారు.  15 వ ఆర్థిక సంఘం 2020-26 కాలానికి ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేయలేదని, జమ్మూకాశ్మీర్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించడంతో కోటా స్వల్పంగా 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించిన విషయాన్ని మంత్రి  వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఏపీ ఉన్నప్పుడు.. ఏపీ లోని పారిశ్రామికవేత్తలు భారీగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి, అనేక మంది జీవనోపాధిని కల్పించారు.  పెద్ద పరిశ్రమలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. 2014లో ఏపీ రెండుగా చీలిపన్నప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్  తెలంగాణలో ఉండిపోగా.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అనాధలా మిగిలిపోయిందనే వాదన ఇప్పుడు కూడా వివనస్తూనే ఉంది. 

  విభజన సమయంలో హైదరాబాద్ ను ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లుగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లు విభజనల ద్వారా    తమ రాజధానులను కోల్పోలేదు. అయితే కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన లోపభూయిష్టంగా జరిగిందని ఒక వైపు చెబుతూనే, ఆ లోపభూయిష్ట విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ఏ విధంగానూ ముందుకు రావడం లేదు. ఈ విషయంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. మెజారిటీ ఇవ్వండి ప్రత్యేక హోదా సాధించుకువస్తామంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం అటుంచి.. కేంద్రం తానా అంటే తందానా అంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి మరోసారి రాష్ట్ర సభలో కుదరదని స్పష్టం చేశారు. ఇక ఏపీ గతి ఇంతే అని ఆయన చెప్పకనే చెప్పేశారు. 

By
en-us Political News

  
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ప్రచారంలోకి దిగారు.
కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని,
గత ఎన్నికల సమయంలో అన్నీ అలా కలిసి వచ్చిన జగన్ కు ఈ సారి మాత్రం ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో తనకు సానుభూతి సంపాదించి పెట్టిన కోడి కత్తి దాడి, బాబాయ్ హత్య ఇప్పుడు ఎదురు తిరిగి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి. పోనీ కొత్తగా సానుభూతి కోసం రాయి దాడి అంటూ హడావుడి చేస్తే అది కాస్తా సానుభూతి మాట అటుంచి నవ్వుల పాలు చేసింది. ఏపీలో ఇప్పుడు జగన్ తరహాలో కంటిపై బ్యాండేజీ పెట్టుకుని తిరగడం యూత్ లో ఒక కొత్త ట్రెండీ ఫ్యాషన్ గా మారిపోయింది. గోదారోళ్ల ఎటకారాన్ని మించిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.