ఏపీలో నోరూల్.. ఓన్లీ అరెస్టులు, వేధింపులు!

Publish Date:Sep 29, 2023

Advertisement

ఏపీలో పాలన ఉందా అంటే ఉంది. మరి ఎక్కడా అంటే గాలి మాదిరి అది రాష్ట్ర ప్రజల కంటికి కనిపించదు. నాలుగేళ్ళ పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు.. ఆ నిర్ణయాల వలన లబ్ది పొందిన ప్రజల గురించి గట్టిగా రెండు నిమిషాలు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. క్యాబినెట్ నిర్ణయాలపై కానీ, అసెంబ్లీ వేదికగా కానీ ప్రజలకు ఆయన ఏం చేయాలనుకున్నారో చెప్పింది చూడలేదు.

మైకు దొరికితే టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై విమర్శలు, గత ప్రభుత్వం అంతా అవినీతే అంటూ ఆరోపణలు. అమరావతి భూమి కుంభకోణం నుండి ప్రతి అంశంలో అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఒక్కటీ నిరూపించలేకపోయారు. ప్రస్తుతం చంద్రబాబును అరెస్ట్ చేయించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఆరోపిస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ ప్రాజెక్టులలో ఆరోపణలపై కూడా ఇప్పటి వరకూ ఒక్క ఆధారం బయటపెట్టింది లేదు. మొన్నటి వరకూ ఆరోపణలతో పబ్బం గడిపిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులతో రాష్ట్రాన్ని డైవర్ట్ చేస్తుంది.

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్టు, లోకేష్ అరెస్టు ఊహాగానాలపైనే చర్చ సాగుతున్నది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? కేసు కొట్టేస్తారా.. విచారణకు ఆదేశిస్తారా? లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారా? ముందే లోకేష్ కు బెయిల్ దక్కుతుందా? ఈ ఇద్దరితో ఈ అరెస్టుల పరంపర ఆగుతుందా? ఒకవేళ చంద్రబాబు, లోకేష్ లను అరెస్ట్ చేస్తే టీడీపీను నడిపించేదెవరు? ఇలా పలు రకాలుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఈ క్రమంలో అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు అందుతున్నాయా? రబీ సీజన్ మొదలైనా రైతులకు విత్తనాలు, సబ్సిడీ ఎరువులు ఏమైనా ఇస్తున్నారా? రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు డబ్బులు జమవుతున్నాయా? ఆరోగ్య శ్రీ అసలు నడుస్తున్నదా? ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయా.. ఇలా ప్రజల సమస్యలపై ఎక్కడా ఎలాంటి చర్చలు లేవు.. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం లేదు.

 రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తో  జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉండడం లేదని, వైద్య పరీక్షలకు కూడా బయటకి పంపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడిక్కడ జిల్లా వార్తాపత్రికల జిల్లా ఎడిషన్ లలో కథనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలలో ఒక్క బస్తా కూడా ఎరువు దొరకడం లేదు. బయట వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు.

ఇంకా మాట్లాడితే అసలు ఏ శాఖకి మంత్రి ఎవరో కూడా 99 శాతం మంది ప్రజలకు తెలియనే తెలియదు. అసలు ఆయా శాఖల మంత్రులకు కూడా వారి శాఖ ఏమిటో, వారి బాధ్యత ఏమిటో తెలుసా అంటూ అనుమానమేనన్న సమాధానం పరిశీలకుల నుంచి వస్తున్నది. అసలు ఆ మంత్రులంతా ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ చెప్పరు. చంద్రబాబు అరెస్టు, పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులపై మాట్లాడేందుకు మాత్రం అందరూ కట్టగట్టుకొని వరసబెట్టి టీవీల ముందుకు వచ్చేస్తారు.

సహజంగా సీఎం వారం రోజులు రాష్ట్రంలో లేరంటే వచ్చీ రాగానే పాలనపై దృష్టి పెడతారు. గత వారంలో రాష్ట్ర పాలన ఎలా సాగింది? ప్రసుత రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? అసలే అప్పుల పాలు చేసిన రాష్ట్రం కనుక ఏదైనా రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పనులు చేయాలంటే ముందున్న అవకాశాలేంటి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ, జగన్ విదేశీ యాత్ర  ముగించుకొని వచ్చిన తర్వాత ఈ తరహా సమావేశాలు చేపట్టినట్లు ఎక్కడా కనిపించలేదు. కనీసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశించినట్లుగా కూడా దాఖలాలు లేవు. కానీ, జగన్ రాష్ట్రానికి వచ్చాక చంద్రబాబు అరెస్టుపై వివరణ ఇవ్వడం, రానున్న ఎన్నికల కోసం ప్రజలను మెప్పించడం ఎలా అనే అంశాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి ఇంచార్జిలు, కన్వీనర్లతో సమావేశాలు నిర్వహించారు. దీనిని బట్టి చూస్తే వైసీపీకి రాష్ట్ర పాలన, ప్రజల సంక్షేమం కంటే ప్రత్యర్థులపై కక్షసాధింపు, రానున్న ఎన్నికల కోసం ప్రజలను ఎలా మాయ చేయాలనే దానిపైనే ఆసక్తి కనబడుతుంది.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.