మంత్రుల సామాజిక న్యాయ భేరి సభ నుంచి జనం పరుగో పరుగు

Publish Date:May 27, 2022

Advertisement

వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట చేస్తున్న బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు. గడపకూ మన ప్రభుత్వం అంటూ జనం వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గడప గడపలోనూ నిరసనలు ఎదురైతే ఇప్పుడు సామాజిక న్యాయ భేరి అంటూ 17 మంది చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు.

విజయ నగరంలో జనం లేకపోవడంతో వర్షం నెపం చెప్పి అర్థంతరంగా సభను రద్ధు చేసుకున్న మంత్రులకు రాజమండ్రిలో జనం లేకపోవడంతో మళ్లీ నిరాస తప్ప లేదు.   17 మంది మంత్రులు ప్రభుత్వం పదవులు, సంక్షేమంలో సామాజిక న్యాయం పాటిస్తోందని చెప్పుకోవడానికి వచ్చే సరికే రాజమంహేంద్రవరంలో   సగానికి పైగా జనం వెళ్లిపోయారు. మంత్రులు వచ్చాకా కూడా జనం వెళ్లిపోతుంటే  పాపం పోలీసులు వాళ్లని ఆపడానికి శతధా ప్రయత్నించారు.

సభా ప్రాంగణం  గేట్లు వేసి ఆపాలని చూశారు. అయినా జనం ఆగలేదు. వాళ్లను తోసుకుంటూ వెళ్లిపోయారు. మంత్రులు చివరకు ఖాళీ కుర్చీలకు తాము చెప్పాల్సింది చెప్పుకొని  అక్కడినుంచి కదిలారు.  పథకాలు ఆపేస్తామని డ్వాక్రా మహిళలను,  ఉపాధి పనులు నిలిపివేస్తామని కూలీలను బెదిరించి మంత్రుల బస్సు యాత్ర సభకు తీసుకు వచ్చారు. వారు కూడా చివరకు మంత్రులు వచ్చే సమయానికి వెళ్లిపోయారు. కాగా మంత్రుల బస్సు యాత్ర సభను స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం ప్రైవేటు బస్సులలో వేల మందిని బలవంతంగా తీసుకు వచ్చినా వారు మంత్రుల ప్రసంగాలను వినడానికి ఇష్టపడలేదు. మంత్రులు వచ్చే సరికే వారు సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలీసులు గేట్టు మూసేసి ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక మంత్రుల బస్సు యాత్ర పేరు చెప్పి రాజమహేంద్రవరంలో పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ఆంక్షలపై ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

అంతకు ముందు విశాఖపట్నంలో  మంత్రుల బస్సు యాత్రు సభకు  డ్వాక్రా మహిళలే ప్రేక్షకులు.   విశాఖ నుంచి  రాజమహేంద్రవరానికి సాయంత్రం నాలుగు గంటలకు మంత్రుల బస్సు చేరుకోవాల్సి ఉండగా   మధ్యాహ్నం రెండుగంటల నుంచే వివిధ బస్సులలో తీసుకొచ్చి మహిళలు, వృద్ధులను కూర్చోపెట్టారు. కానీ 6 గంటలైనా మంత్రుల బస్సు రాకపోవడంతో జనం తిరుగుముఖం పట్టారు. సుమారు రాత్రి 7 గంటలకు మంత్రుల బస్సు వచ్చింది. అప్పటికే సగం జనం వెళ్లిపోయారు.  

జనాన్ని తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడతారని పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. రాజమహేంద్రవరం సభ జన సమీకరణకు మండలానికి 15 ప్రైవేట్‌ బస్సుల వరకూ ఏర్పాటు చేశారు

By
en-us Political News

  
ఏపీలో వైసీపీకి గాలాడటం లేదు. ఆ పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. చివరాఖరికి ఐప్యాక్ తాజాగా జగన్ కు సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొంది. ఇంత కాలం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్ సొంత సామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైపోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ స‌ర్కార్ కు ఈసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్ద‌రూ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని, ఎన్నిక‌ల‌కు సంబంధంలేని విధుల‌ను వీరికి అప్ప‌గించాల‌ని ఆదేశించింది.
శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే.
ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా?
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది.
ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టును ఇశ్రయించారు.
రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికి విధ్యార్హతలు అక్కరలేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు, ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు.
కేసీఆర్ కట్టడం కూలిందంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో వున్న కట్టడం కూలిందనో, హైదరాబాద్ నంది నగర్లో ఆయనకు
తిమ్మిని బమ్మిని చేసి, మాటలతో మాయ చేసే తండ్రి సపోర్టు బాగా వుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా నడిచింది.
శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను మే 1కి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శవంలా మిగిలింది. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికీ క్షమించరు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.