ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. మూడు రాజధానుల ముచ్చటే లేదు!

Publish Date:Mar 14, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో  మూడు రాజథానుల అంశం ప్రస్తావనే లేకపోవడంపై అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్ కానీ, ఆయన కేబినెట్ సహచరులు కానీ ఖాతరు చేయకుండా అవకాశం ఉన్నా లేకున్నా.. సందర్భం వచ్చినా రాకున్నా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు మా విధానం అంటూ ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సైతం తాను త్వరలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తానంటూ గ్లోబల్ సమ్మిట్ కు ముందూ, సమ్మిట్ వేదికగానూ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంలో కచ్చితంగా మూడు రాజధానుల ప్రస్తావన ఉంటుందని అంతా భావించారు. జగన్ సర్కార్ కోర్టు ధిక్కరణ అన్న అంశాన్ని ఇసుమంతైనా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు కారణంగానే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన జొప్పిస్తారని పరిశీలకులు సైతం అంచనా వేశారు. అయితే ఆశ్చర్యకరంగా గవర్నర్ ప్రసంగంలో ఆ ప్రస్తావనకు చోటు లేకుండా పోయింది. గవర్నర్ కు ఇచ్చే ప్రసంగ పాఠంలో ఆ అంశాన్ని జొప్పించే ధైర్యం జగన్ సర్కార్ చేయకపోవడానికి ఆయన సుదీర్ఘ కాలం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ ఆ అంశాన్ని  జొప్పించినా గవర్నర్ అది చదవడానికి నిరాకరించి ఉండేవారన్న భావనతోనే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందని పరిశీలకులు చెబుతున్నారు.

ఆ ఒక్క అంశం వినా గవర్నర్ ప్రసంగం మొత్తం జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూనే కొనసాగింది. ఏపీ సర్కార్ పారదర్శక పాలన అందిస్తోందని అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.   పేదల సంక్షేమమే లక్ష్యంగా   పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవినీతి రహితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్ల చెప్పారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో పథకాల సొమ్ములు క్రమం తప్పకుండా జమ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో తన సర్కార్ సుపరిపాలన అందిస్తోందన్నారు. అర్థిక రంగంలో ఏపీ పురోగమిస్తోందనీ, వ్యవసాయం, పారిశ్రామిక రంగం సహా అన్ని రంగాలూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయనీ గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

. కాగా గవర్నర్ ప్రసంగంలో వృద్ధి రేటు ప్రస్తావన రాగానే తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో గణాంకాలన్నీ కల్పితాలేనని విమర్శించారు. గవర్నర్ నోట జగన్ సర్కార్ అబద్ధాలు పలికిస్తోందంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 9 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 16న సభలో విత్త మంత్రి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

By
en-us Political News

  
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.