హోంమంత్రి బాధ్యతా రాహిత్యం.. శాంతి భద్రతలు ఎక్కడ తానేటి వనితా మేడం

Publish Date:May 3, 2022

Advertisement

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత వైఖరి. రాష్ట్రంలో ఏం
జరిగినా అది విపక్ష తెలుగుదేశం పనే అంటున్నారామె. రాష్ట్రంలో రోజూ మూడు మర్డర్లు, ఆరు రేపులు అన్నట్లుగా నేర సామ్రాజ్యం వర్ధిల్లుతుంటే.. నేరలను అరికట్టి నేరగాళ్ల పీచమణచాల్సిన పదవిలో ఉన్న తానేటి వనిత  విపక్షాలపై నెపం మోపి బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటం దారుణం.  ప్రభుత్వంలో ఉన్న వారు విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.    అత్యాచార ఘటనలపై సహజంగానే విపక్షాలు విమర్శలు సంధిస్తాయి. నేరాలు వరుసగా అదుపులేకుండా జరుగుతున్నాయంటే అది కచ్చితంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యమే. శాంతి భద్రతల పరిరక్షణకు మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాల్సిన హోంమంత్రి విపక్ష టిడిపి వాళ్ల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం బాధ్యతా రాహిత్యం తప్ప మరొటి కాదు.  రేపల్లె సామూహిత అత్యాచారం సంఘటనకు మద్యం మత్తే కారణమంటూ తేలిగ్గా తీసుకోవడం హోంమంత్రికి అందునా ఒక మహిళకు ఎంత మాత్రం తగదు. ఇటువంటి సంఘటనలు ఏపీలో నిత్యకృత్యంగా మారిపోవడం అన్నది రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పాలి.

చట్టాలు చేశామని చెప్పుకుంటే సరిపోదు. అవి సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.  ఎపిలో చోటు చేసుకుంటున్న సామూహిక అత్యాచార ఘటనలను మహిళలు బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది.  ఆంధప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనల నిరోధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా మంత్రుల స్థాయిలో ఉన్న వారు కూడా నేరస్తులకు వత్తాసు పలుకుతున్నట్లుగా మాట్లాడటం వారిని ప్రోత్సహించడం తప్ప మరొకటి కాదు.  మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభించడం కూడా ప్రభుత్వ వైఫల్యమే.  ఇలాంటి ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు వేయాలి. అలా కాకుండా సర్కార్ ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో నేరాలు పెట్రేగిపోతున్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం. కొన్ని సంఘటనల్లో అధికార పార్టీ వారి జోక్యం వల్ల పోలీసులు నిందితులను తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా రాష్ట్రంలో నేర సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా విస్తరించడానికి కారణమౌతున్నది.

ఈ వాస్తవాలన్నిటినీ పట్టించుకోకుండా అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా అన్నిటికీ విపక్షమే కారణమంటూ హోంమంత్రి నిర్ధారణకు వచ్చేయడం బాధ్యతా రాహిత్యం కాక మరొకటి కాదు.    ఖజానా నింపడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్టాలు, ఆ మత్తులో జరిగే నేరాలకు బాధ్యత వహించి తీరాలి. ఆ నేరాల్ని పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మద్రాసు హైకోర్టు 2019 మార్చిలో తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో నిందితులు చేసే నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత అంటూ ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం. అంటే మద్యం విక్రయాలతో ఖజానా నింపుకోవడమే కాదు.. ఆ కారణంగా అకృత్యాలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పరోక్షంగా హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకుం టున్న అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు. అఘాయిత్యానికి ఒడిగట్టారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ యువకుడు  కన్నతల్లిపైనే అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకున్న తండ్రిపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన తల్లిని బండరాయితో వెూది చంపేశాడు. అనంతపురం జిల్లాలో 33 ఏళ్ల యువకుడు   కన్నతల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎంత వారించినా వినకపోవటంతో తల్లిదండ్రులు అతడిని చంపి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో కన్న కుమార్తెపైనే అత్యాచారయత్నం చేసిన ఘటన కొన్నాళ్ల కిందట ఏలూరు జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. ఇక అంతకుముందు స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

మచిలీపట్నం తాలూకా కరగ్రహారం శివారు పల్లిపాలెం బీచ్‌లో నెల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది.  సీఎం జగన్‌ నివాసానికి అత్యంత సవిూపంలో ఉన్న సీతానగరం పుష్కర్‌ ఘాట్‌కు.. కాబోయే భర్తతో కలిసి విహారానికి వెళ్లిన యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ‘దిశ’ ఏమైందో, ఎక్కడుందో తెలియడం లేదు. నేరాల నియంత్రణ విషయంలో శాంతి భద్రతలను నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ దిశ, దశ లేక నిర్వీర్యమై నిస్తేజంగా మిగిలిపోయింది. పోలీసుల విధి నిర్వహణలో ప్రభుత్వ మితిమీరిన జోక్యమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో పులివెందుల రాజ్ నడుస్తోందన్న విపక్షాల విమర్శలు వరుసగా జరుగుతున్న అకృత్యాలు  వాస్తవమే అనిపించేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.