బండి సంజయ్ పాదయాత్ర ప్రచారార్భాటమే తప్ప.. ప్రజాదరణ విషయంలో పెద్ద ప్లాప్ అని బీజేపీ శ్రేణుల్లోనే నిరాశ ఎదురౌతున్నది. రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజలలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకుని వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే లక్ష్యం అని చెప్పుకుంటూ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేర చేపట్టిన పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పెద్ద హైప్ ఇచ్చింది. అయితే వాస్తవంగా ప్రజాదరణ, ప్రజాస్పందన విషయంలో బండి పాదయాత్ర సాధించిందేమీ లేదని కమలం శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. బండి యాత్రలో ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా తెరాస నుంచి పెద్ద ఎత్తున నేతలు కమల తీర్ధం పుచ్చుకోనున్నారంటూ బీజేపీ ప్రచారం చేసుకుంది. అయితే అలా చేరిన దాఖలాలు లేవు సరికదా, బీజేపీలో చేరతారంటూ కమలం ప్రచారం చేసుకున్న నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆ పార్టీతో మంతనాలు జరుపుకుంటున్నారు.
కమలం తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరిగిన వాళ్లలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. అయితే ఆయన కమలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు సరికదా.. సొంత గూటికి అంటే కాంగ్రెస్ లో చేరుందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగే పలమూరులో కూడా తెరాస నుంచి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగిన నేతలు కూడా ఇప్పుడు కాదు మరోసారి చూద్దామంటూ మొహం చాటేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో తెరాసకు దీటుగా ఎదిగామని చెప్పుకుంటున్న కమలనాథులకు ఈ పరిణామం మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికల విజయంతో తమ బలాన్ని అతిగా ఊహించుకుని చేరికలపై ప్రచారం చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఉనికే లేదనుకున్న కాంగ్రెస్ చాపకింద నీరులా బలోపేతం అవుతోందనీ, ఎన్ని అంతర్గత విభేదాలున్నా, పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టాకా ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చిందనీ అంటున్నారు. ఈ కారణంగానే బీజేపీలో చేరికలకు బ్రేక్ పడిందనీ, తెరాసలో అసమ్మతి వాదులు బీజేపీ కంటే కాంగ్రెస్ లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారనీ వారంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-joinings-in-bjp-in-bandi-padayatra-25-135396.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.