ఏపీలో వాడిపోతున్న కమలం.. బీజేపీ హైకమాండ్ ఏం చేస్తోంది?

Publish Date:Nov 6, 2024

Advertisement

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌లోపేతానికి ఆ పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తూ ఒక్కో రాష్ట్రాన్ని త‌మ ఖాతాలో వేసుకుంటున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్యంగా త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బ‌లోపేతం అవుతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా ప్ర‌ణాళిక‌తో ఆ పార్టీ నేత‌లు ముందుకెళ్తున్నారు. త‌మిళ‌నాడులోనూ బీజేపీ బ‌లోపేతానికి వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. మ‌రోవైపు క‌ర్ణాట‌క‌లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేలా బీజేపీ ఇప్ప‌టి నుంచే వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతంపై మాత్రం బీజేపీ పెద్ద‌లు దృష్టి సారించ‌డం లేదు. ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ లు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. అయితే, ఎన్నిక‌ల త‌రువాత తెలుగుదేశం, జ‌న‌సేన  అధిష్టానాలు త‌మత‌మ‌ పార్టీల బ‌లోపేతం చేయడంపై దృష్టి సారించాయి. బీజేపీ నేత‌లు మాత్రం ఆ  దిశగా ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. మ‌రోవైపు బీజేపీ అధిష్ఠానం కూడా రాష్ట్రంలో పార్టీ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. 

ఏపీలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ లు రాష్ట్ర అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టిసారించారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ అరాచ‌క పాల‌న‌తో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుప‌డిపోయింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం హోదాలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చ‌డంతోపాటు.. అభివృద్ధిని పూర్తిగా ప‌క్క‌న‌ ప‌డేశారు. ఫ‌లితంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఒక ప‌క్క అమ‌రావ‌తి రాజ‌ధానిలో భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌పై దృష్టిసారించ‌డంతోపాటు.. పోలవ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రంలో ర‌హ‌దారుల నిర్మాణం, మరమ్మతులు ఇలా అన్నిరకాలుగా అభివృద్ధిపై చంద్ర‌బాబు దృష్టిసారించారు. ఇద‌లా ఉంటే చంద్ర‌బాబు, లోకేశ్ పార్టీ బ‌లోపేతంపైనా దృష్టిసారించారు. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ నుంచి ప‌లువురిని త‌మత‌మ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఇప్ప‌టికే వైసీపీ సీనియ‌ర్ నేతలు టీడీపీ, జ‌న‌సేనలలో చేరారు. మ‌రికొంద‌రు ఆయా పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విష‌యంలో కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ మాత్రం వెనుక‌బ‌డిపోయింది. బీజేపీ  పెద్ద‌లు రాష్ట్రంలో పార్టీ ఉందన్న సోయ లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

 కూట‌మి ప్ర‌భుత్వంలో బీజేపీ నేత‌ల‌కు అన్యాయం జ‌రుగుతున్నద‌ని బీజేపీ రాష్ట్ర పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రిగా అవ‌కాశం క‌ల్పించి స‌ముచిత న్యాయం చేసిన‌ప్ప‌టికీ.. నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ విష‌యంలో.. ఇటీవ‌ల టీటీడీ పాల‌క వ‌ర్గం ఎంపిక విష‌యంలో బీజేపీకి ఇసుమంతైనా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నెల‌లో ఏపీ ప్ర‌భుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక వైస్‌ఛైర్మన్‌ను నియమించింది. 7 కార్పొరేషన్లలో 64 మందికి సభ్యులుగా అవకాశం కల్పించింది. ఇందులో బీజేపీ నేత‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. 20 కార్పొరేష‌న్ చైర్మ‌న్ల‌లో కేవ‌లం ఒక్క కార్పొరేష‌న్ (20 సూత్రాల అమ‌లు క‌మిటీ – లంకా దిన‌క‌ర్) ను మాత్ర‌మే బీజేపీకి కేటాయించారు. ఐదుగురు బీజేపీ నేత‌ల‌ను స‌భ్యులుగా నియ‌మించారు. దీనికితోడు ఇటీవ‌ల టీటీడీ పాల‌క వ‌ర్గం నియామ‌కంలోనూ బీజేపీకి అన్యాయం జ‌రిగింద‌ని ఆపార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తిరుపతికి చెందిన సీనియర్‌ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి పాలక మండలిలో చోటు ద‌క్కించింది. మ‌రొక బీజేపీ నేత‌కు టీటీడీ పాల‌క‌వ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పిస్తే బాగుండేద‌న్నభావన బీజేపీ రాష్ట్ర నాయకుల్లో వ్యక్తం అవుతోంది. అయితే, ఎన్టీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్  రాష్ట్ర బీజేపీ నేత‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. 

బీజేపీ కేంద్ర పెద్ద‌లుసైతం ఏపీలో పార్టీ బ‌లోపేతంపై పెద్ద‌గా దృష్టిసారించ‌డం లేదు. దీంతో పార్టీలోని ఓ వ‌ర్గం నేత‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లోకి ప‌లువురు వైసీపీ నేత‌లు చేరారు. బీజేపీ రాష్ట్ర అధిష్టానం, కేంద్ర అధిష్టానం పెద్ద‌లు మాత్రం పార్టీలో చేరిక‌ల విష‌యంపై అస‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని, త‌ద్వారా క్షేత్ర‌ స్థాయిలో పార్టీ క్యాడ‌ర్ లో నిస్తేజం నెల‌కొంటుంద‌ని  పార్టీ రాష్ట్ర నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విష‌యాన్ని కేంద్రం పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ వారు పట్టించుకోలేదు. కేంద్ర పార్టీ పెద్ద‌లు జోక్యం చేసుకొని ప్ర‌భుత్వ నామినేటెడ్ ప‌దవుల్లో రాష్ట్ర‌ బీజేపీ నేత‌ల‌కు వీలైన‌న్ని ఎక్కువ ప‌ద‌వులు ద‌క్కేలా చూడాల్సింది పోయి.. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిని సైతం ప‌ట్టించుకోక‌పోవ‌టంతో కొంద‌రు నేత‌లు ఏకంగా పార్టీ మారే ఆలోచ‌న సైతం చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, త్వ‌ర‌లో మ‌రో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు సిద్ధ‌మ‌య్యారు. వ‌చ్చే వారం రోజుల్లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు జోక్యం చేసుకొని.. రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌కు ఏమేర‌కు ఎక్కువ నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కేలా చూస్తార‌నే విష‌యంపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంది.

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.