ఫ్రంటూ లేదు గింటూ లేదు.. కేసీఆర్ నిర్వేదానికి కారణమేంటంటే?

Publish Date:Apr 22, 2022

Advertisement

కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం బీజేపీకి అధికారాన్ని సంపాదించి పెట్టింది. యూపీఏ 1, యూపీఏ 2 వైఫల్యాల ప్రభావంతో 2014 ఎన్నికల సమయంలో మోడీ నినాదం కాంగ్రెస్ ముక్త భారత్ పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో పాటు నాడు బీజేపీ అధికారంలోనికి రావడానికి నల్లధనంపై పోరాటం, విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తాం వంటి వాగ్దానాలూ బీజేపీ విజయానికి దోదహపడ్డాయి. అయితే ఎనిమిదేళ్ల తరువాత కూడా కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్నే నమ్ముకుని ముందుకు సాగుదాం అనుకుంటున్న కమలనాథుల కలలు నెరవేరడం లేదు.
కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఉన్నది పేరుకే ఎన్డీయే సర్కార్. కానీ ఎన్డీయే కూటమిలో సొంత గళం వినిపించగలిగే భాగస్వామ్య పక్షం దాదాపు లేదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో బీజేపీయేతర పార్టీలు ఏకమైతే తప్ప మోడీని దీటుగా ఎదుర్కొనడం సాధ్యం కాదన్న నిశ్చితాభిప్రాయానికి దాదాపు అన్ని పార్టీలూ వచ్చేశాయి. 
గతంలో అయితే...అయితే ఎన్డీయే, కాకపోతే యూపీఏ అన్నట్లుగా కూటములు ఉండేవి. అయితే 2014 తరువాత నుంచి దేశంలో కాంగ్రెస్ ప్రభావం గణనీయంగా తగ్గడంతో ఆ పార్టీ వెనుక కూటమి కట్టేందుకు పార్టీలు పెద్దగా ఆసక్తి కనబరచని పరిస్థితి ఏర్పడింది. కానీ 2024 ఎన్నికలు సమీపానికి వచ్చే సరికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాలు, ఆ పార్టీకి ఉన్న పార్లమెంటు సభ్యుల బలంతో సంబంధం లేకుండా ఆ పార్టీ లేకుండా బీజేపీయేతర కూటమి ఏర్పడే అవకాశం లేదన్న నిర్ధారణకు బీజేపీయేతర పార్టీలు వచ్చేశాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓట్లూ, సీట్లూ  విషయంలో గతంలోలా కమాండింగ్ పొజిషన్ లో లేకపోయినా, ఆ పార్టీ లేకుండా బీజేపీని ఢీ కొనడం అంత తేలిక కాదని బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపుగా నిర్ధారణకు వచ్చేశాయి. క్షేత స్థాయిలో ఆ పార్టీకి ఇప్పటికీ ఉన్న బలమైన పునాదులే అందుకు కారణం
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటే...

కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ జాతీయ స్థాయిలో ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపాదనకు జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల నుంచి స్పందన లేకుండా పోయింది. ఆ దిశగా జరిగిన ప్రయత్నాలలో భాగంగా జరిగిన సమావేశాలలో కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర ఫ్రంట్ అసంభవమన్న అభిప్రాయాన్నే టీఆర్ఎస్ మినహా మిగిలిన బీజేపీయేతర పార్టీలన్నీ వ్యక్తం చేశాయి. దీంతో కేసీఆర్ పరిస్థితి వ్రతమూ చెడింది...ఫలతమూ దక్కలేదన్నట్లుగా తయారైంది. ఫ్రంట్ నేతగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామనుకున్న ఆయన ఆశలకు ఆదిలోనే హంసపాదు పడింది. 
ఆది నుంచీ బీజేపీకి అన్ని విషయాలలోనూ మద్దతుగా నిలబడిన ఆయన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో బీజేపీ వ్యతిరేకులలో చాంపియన్ అనే ముద్ర కోసం ఆ పార్టీ వ్యతిరేక విధానాన్ని అవలంబించారు. అందులో భాగంగానే వడ్ల కొనుగోలు నుంచి....తెలంగాణకు మోడీ సర్కార్ అన్యాయం చేసిందంటూ ఆ పార్టీపై రణభేరి మోగించారు. 
ఆయన మోడీ సర్కార్ వ్యతిరేక వైఖరి కారణంగానే రాష్ట్రంలో అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న బీజేపీ ప్రతి విమర్శలతో పుంజుకుని తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగిందా అన్న భావన కలిగేలా కార్యక్రమాల జోరు పెంచింది. 
ఇప్పుడు మూడో ఫ్రంట్ ప్రయత్నాలు తుస్సుమనే సరికి కేసీఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల ను ఢీ కొంటూ..ఒంటరిగా జాతీయ రాజకీయ యవనికపై తన ముద్ర చాటుకోవడానికి ప్రయత్నించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ దశలోనే ఆయన ఫ్రంటూ లేదు గింటూ లేదు...నేనే జాతీయ పార్టీ పెడతా అంటూ ప్రకటన చేసేశారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయి గుర్తింపునకు తాపత్రేయ పడటం కేసీఆర్ తోనే ప్రారంభం కాలేదు. ఆయనతోనే అంతం కాదు. కానీ ఇప్పటికప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం వల్ల అదనంగా చేకూరే ప్రయోజనమేమిటన్నదానిపైనే అందరి సందేహాలూ... 
-ఐక్యంగా లేకుంటే నష్టమే అని..
ఢిల్లీలో కనీసం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానైనా కలవడానికి ఇష్టపడని ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ క్రేజీవాల్‌ కూడా బీజేపీని ఎదుర్కోనే క్రమంలో కాంగ్రెస్‌ కు దగ్గరవుతున్నట్లు సంకేతాలిచ్చారు. రాబోయే గుజరాత్‌ ఎన్నికల్లో అవసరమైతే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే దిశగానూ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాము ఐక్యంగా లేకపోతే బీజేపీకే ప్రయోజనం అనే విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించినట్లు తాజా ఉమ్మడి లేఖద్వారా తేటతెల్లం అయింది. కానీ కేసీఆర్‌ ను కనీసం బీజేపీ వ్యతిరేకిగా గుర్తించకపోవడం బహుశా మొన్నటిదాకా ఆయన వ్యవహరించిన తీరే కారణమనే విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏడేళ్లపాటు బేషరతుగా మద్దతు పలికి, మోదీ సర్కార్‌ చేసిన అన్ని చట్టాలనూ సమర్థించిన కేసీఆర్‌.. ఇప్పుడు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీని విభేదిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బీజేపీ అనుకూల పార్టీలను ఒప్పించడంలో విఫలం..
ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఇప్పటిదాకా కేసీఆర్‌ కాంగ్రెస్‌తో కలిసి ఉన్న పార్టీల నేతలను కలిసి మాట్లాడారే తప్ప.. బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను కలిసి, వాటిని ఒప్పించే ప్రయత్నాలు చేయలేదు. కనీసం పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్‌ ను కూడా కలవని వైనాన్ని ప్రధాన ప్రతిపక్షాలు గమనిస్తున్నాయి. కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న కూటమి వల్ల విపక్షాల ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. అందుకే సంయుక్త ప్రకటనలో కేసీఆర్‌ పేరును చేర్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు.. కేసీఆర్‌–టీఆర్‌ఎస్‌లో బీజేపీ వ్యతిరేక పంథాలో నిలకడ ఎంత? అనే ప్రశ్న తలెత్తుతోందని విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.