Publish Date:Aug 23, 2022
అమెరికా చెబితేగాని మనవాళ్లు దేన్ని నమ్మేట్టు లేరు. గోరంట్ల మాధవ్ వీడియోకి సంబంధించి అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫోర్డ్ నివేదికకు, అంతకుముందు తాము విడుదల చేసిన నివేదికకు తేదీ తప్ప మరే తేడా లేదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఆయన ఈ చిన్న విషయానికి సీఐడీ అధికారి సునీల్ కుమార్ తాము అమెరికా ల్యాబ్ నివేదికలు మార్చేశామని, కేసులు పెడతామని హెచ్చ రించడం అర్ధరహితమని పట్టాభి అన్నారు. ఇదంతా గోరంట్లను కాపాడుకోవడానికి చేస్తున్న కుట్రలని పట్టాభిరామం మీడియాతో అన్నారు.
అమెరికా ల్యాబ్ నివేదికలో నిజాలు బయటపడతాయని అంటున్నవారు మరి ఇపుడు ఆ నివేదికను బహి ర్గతం చేయాలని ఆయన సవాల్ చేశారు. వాస్తవానికి తాము వీడిమో పంపిన తేదీని అందులో పేర్కొన లేదని, దీన్ని ఐ ఫోన్కి చెందిన ఫేస్ టైమ్ వీడియో కాల్ అని నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్నారని అన్నారు. చిత్రమేమంటే తాము వీడియోను పంపిన తేదీని నివేదికలో పేర్కొనలేదని పట్టాభి ఆరో పించారు. అయితే అదేమంత పెద్ద పని కాదుగనుక జిమ్ స్టాఫోర్డ్ సిబ్బంది ఆ మార్పులు చేసి పంపారన్నారు. అయి తే తన సిబ్బంది చేసినది తెలియక స్టాఫోర్డ్ అసలా మార్పులు తాము చేయలేదని సీఐడీకి తెలియజేశారు.
ఇక్కడ చిత్రమేమంటే ఫేస్ టైం వీడియో కాల్ అనకుండా వీడియో కాల్ అని ఉంటే నివేదిక సారాంశం మారిపోతుందా? కానీ స్టాఫోర్డ్ మాత్రం తాను ఇచ్చిన నివేదికలో ఎలాంటి మార్పుచేర్పులు లేవనే అంటు న్నారు. సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్కు అన్ని విషయాలు స్పష్టంగా తెలుసునని, ఆయన నిజా యితీగా ఉంటే తాము విడుదల చేసిన కాపీని, తనకు అంది నివేదిక కాపీని విడుదల చేసి తేడాని ఆయనే వివరిం చాలని పట్టాభి కోరారు. కానీ అధికారి ఎందుకు వెనకడుతువేస్తున్నారో తెలియదని విమర్శించారు.
బాధ్యత గల ఎంపీ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తే నిజానిజాలు తేల్చడానికి ప్రభు త్వం ముందుకు రానప్పుడు, ప్రధాన ప్రతిపక్షంగా తమ విధిని నిర్వర్తించామన్నారు. ఎంపీని కాపాడటానికి వైసీపీ దిగజారి ప్రవర్తించిందని విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-difference-except-in-dates-says-pattabhi-39-142476.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.