కేసీఆర్ మారడు.. మరోసారి క్లారిటీ వచ్చింది!

Publish Date:Apr 24, 2024

Advertisement

పుట్టుకతో వచ్చిన బుద్ధి... అంటారు చూశారా.. ఆ మాట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సరిగ్గా సూటవుతుంది. పదేళ్ళపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా అహంకారపూరితమైన అధికారాన్ని చెలాయించిన కేసీఆర్‌ని, ఆయన పార్టీని నిన్నటి ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఇంటికి సాగనంపారు. దారుణమైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ఆత్మ విమర్శ చేసుకుని, పద్ధతులలో మార్పులు చేసుకుంటే వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌కి మళ్ళీ ప్రజాదరణ లభిస్తే లభించవచ్చు. కానీ, కేసీఆర్‌గానీ, ఆయన పార్టీలోని వ్యక్తులుగానీ తమ పాత ధోరణిలోనే వున్నారు తప్ప మారే ధోరణిలో ఎంతమాత్రం లేరు. ఈ విషయం కేసీఆర్ తాజాగా ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరు చూస్తూ అర్థమవుతోంది. తమను ఇంటికి పంపించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని కేసీఆర్ అంటున్నారంటే, ఇంతకంటే అమాయకత్వం, అహంకారం మరొకటి వుంటుందా?
1989లో ఎన్టీఆర్‌ని కూడా ప్రజలు ఓడించారు. తనకు తిరుగేలేదని అప్పటి వరకూ భావిస్తూ వచ్చిన ఎన్టీఆర్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో షాకయ్యారు. అయినప్పటికీ, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తనను తాను మార్చుకున్నారు. అంతే తప్ప ప్రజలను ఏనాడూ నిందించలేదు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లో రాణించిన కేసీఆర్ ఎన్టీఆర్ నుంచి ఈ గుణాన్ని నేర్చుకోలేదు.
పదేళ్ళ కేసీఆర్ అధికారాన్ని పీకి అవతల పారేసిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ కేసీఆర్‌కి అంగుష్టమాత్రుడిగానే కనిపిస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయాలంత ఎత్తున ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు. తాను పదేళ్ళపాటు అద్భుతమైన పరిపాలన అందించినట్టే భావిస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా గొప్పవనే భావిస్తున్నారు. మేడిగడ్డ కుంగిపోవడం చాలా చిన్న విషయంగానే భావిస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. తాను చాలా గొప్ప పరిపాలన అందించినట్టే ఆయన భావిస్తున్నారు. 
బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. భవిష్యత్తులో కేసీఆర్ కుటుంబం, ఆయన కుటుంబానికి విధేయంగా పడివుండేవారు తప్ప మరెవరూ ఆ పార్టీలో వుండే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి వాస్తవ పరిస్థితులకు భిన్నమైన విధంగా కేసీఆర్ వాదన వుంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నాయకులు తనకు ఫోన్ చేసి, అనవసరంగా బీఆర్ఎస్‌ని వదిలి వెళ్ళామని బాధపడుతున్నారట. కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు పార్టీలో వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకే కేసీఆర్‌కి ఫోన్ చేసే సీన్ లేదు.. ఇప్పుడు బయటకి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేయడం, ఈయన మాట్లాడ్డం... బాగుందండి కల్పన. కేసీఆర్ అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ పార్టీలో వున్న 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో వున్నారట. వాళ్ళంతా బీఆర్ఎస్‌కి మద్దతు ఇస్తున్నారట, కాంగ్రెస్ నుంచి 
బయటకి వచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. 

By
en-us Political News

  
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ నేతల ప్ర‌చారం హోరెత్తుతోంది. రాష్ట్రం న‌లుమూల‌లా అభ్య‌ర్థులు గెలుపుకోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్త‌యితే గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌, మేధావి వ‌ర్గ‌మూ ఎక్కువే. అలాంటి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం అభ్య‌ర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్​లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భ‌య‌ప‌డ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.