ఆ డీప్‌ఫేక్ వీడియోలు తొలగించండి.. మెటా, గూగుల్, ఎక్స్‌లకు బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు

Publish Date:Aug 5, 2026

Advertisement

సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతోందో, దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రముఖుల ప్రతిష్టను దిగజార్చే కుట్రలు కూడా అంతే స్థాయిలో విస్తరిస్తున్నాయి.   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాలలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని కొందరు సృష్టించిన డీప్ ఫేక్ వీడియోలు, కల్పిత ఆరోపణల వ్యవహారం వివాదాస్పదమైంది.  దీనిపై తీవ్రంగా స్పందించిన బాంబే హైకోర్టు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న గడ్కరీ డీప్ ఫేక్ వీడియోలు,  అభ్యంతరకర కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. 

దేశంలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విధానంఅమలులోకి వచ్చినప్పటి నుంచి దీనిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విధానాన్ని ఆసరాగా చేసుకుని..  మంత్రి నితిన్ గడ్కరీ,  ఆయన కుటుంబం ఆర్థికంగా భారీగా లబ్ధి పొందుతోందంటూ సామాజిక మాధ్యమాలలో  ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా  ఏఐతో తయారు చేసిన డీప్‌ఫేక్ వీడియోలతో ఆయన ప్రతిష్టకు  భంగం కలిగిలా  డిజిటల్ మాధ్యయాలో పోస్టులు వైరల్ అయ్యాయి.  దీనిపై  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇథనాల్ ఇంధన విధానం అనేది కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని, దానికి తన రవాణా మంత్రిత్వ శాఖతో గానీ లేదా వ్యక్తిగతంగా తన కుటుంబంతో గానీ ఎలాంటి రకమైన ఆర్థిక సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. కేవలం తన, తన కుటుంబం  పరువు తీయడమే లక్ష్యంగా కుట్రపూరితంగా ఈ పోస్టులు చేశారని పేర్కొంటూ, తన పరువుకు కలిగిన భంగానికి గాను   11 కోట్ల రూపాయల భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ  కోర్టును ఆశ్రయించారు.

గడ్కరీ పిటిషన్ ను విచారించిన బాంబే హైకోర్టు ధర్మాసనం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను ' నీచమైన, నిందాపూర్వకమైనదిగా  పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.   దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), గూగుల్ (యూట్యూబ్), ఎక్స్ (ట్విట్టర్) సంస్థలకు  గడ్కరీకి వ్యతిరేకంగా ప్రచారంలో ఉన్న అన్ని ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు, వ్యాఖ్యలు, ఫోర్జరీ పోస్టులను తక్షణమే  శ్వతంగా తొలగించాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా ముంబై హైకోర్టు  సోషల్ మీడియా దిగ్గజాలనుద్దేశిస్తూ.. సమాజంలో లేదా రాజకీయాల్లో ఉన్న ప్రముఖులు, సాధారణ పౌరులు తమ పరువును కాపాడుకోవడానికి ప్రతిసారీ కోర్టు తలుపు తట్టాలా అని ప్రశ్నించింది. ఇలాంటి పరువు నష్టం కలిగించే అభ్యంతరకర కంటెంట్‌ను, డీప్‌ఫేక్ వీడియోలను ప్లాట్‌ఫామ్‌లు తమంతట తామే స్వచ్ఛందంగా గుర్తించి తొలగించేలా ఏదైనా మెకానిజం ఉందా అని నిలదీసింది.  

Nitin Gadkari, Bombay High Court, Deepfake Videos, E20 Ethanol Fuel, Meta Google X, Social Media Defamation

By
en-us Political News

  
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.