Publish Date:Aug 25, 2022
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీ విశ్వాసాన్ని చూరగొన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆర్జేడీ తదితర పార్టీల మద్దతుతో మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మొదటి అసెంబ్లీ సమావేశం బుధవారం జరిగింది. ఆ సమావేశంలో నితీష్ కుమార్ సభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. అయితే బల పరీక్సకు ముందు నితీష్ మాట్లాడుతూ రెండేళ్ల కిందట బీజేపీ కన్నా చాలా తక్కువ స్థానాలు వచ్చిన జేడీయూకే సీఎం పదవి దక్కడానికి గల కారణాలను వివరించారు. 2020 ఎన్నికల అనంతరం బీజేపీ తనపై తీవ్ర ఒత్తడి తీసుకువచ్చి తాను సీఎం పదవిని చేపట్టేలా ఒప్పించిందని వెల్లడించారు. బీజేపీ కంటే తక్కువ స్థానాలు వచ్చిన జేడీయూ నుంచి తనకు సీఎం పదవి వస్తుందని తానసలు ఊహించలేదనీ, బీజేపీ నుంచి రేసులో ఉన్న ఉన్న సుశీల్ కుమార్ మోడీయే బీహార్ సీఎంగా బాధ్యతలు చేపడతారని తాను భావించినట్లు చెప్పారు. అయితే బీజేపీ తనపై ఒత్తిడి తీసుకు వచ్చి సీఎం పదవి చేపట్టేలా ఒప్పించిందని వివరించారు. అయితే ఆ మరుక్షణం నుంచీ అన్ని వైపుల నుంచీ తన కాళ్లూ చేతులూ కట్టేయడానికే ప్రయత్నించిందని నితీష్ ఇప్పుడు ఆరోపించారు.
స్పీకర్ విషయంలో కూడా అప్పట్లో తన మాట నెగ్గలేదని వివరించారు. అలా రెండేళ్ల పాటు ఒత్తిడుల మధ్య సీఎంగా కొనసాగిన తాను చివరకు ఆ బంధాన్ని తెంచుకున్నానని వివరించారు. తాజాగా మహాఘట్ బంధన్ ప్రభుత్వం కొలువుదీరి, సభలో బల పరీక్ష ఎదుర్కొంటున్న సమయంలో మహాఘట్ బంధన్ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు నిర్వహించడం ఎంతమాత్రం యాధృచ్ఛికం కాదని సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. రైల్వే ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్న కేసులో భాగంగా సీబీఐ బీహార్ లో దాడులు నిర్వహించింది.
2004-09 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో జరిగిన రిక్రూట్మెంట్లలో పలువురు అభ్యర్థులకు గ్రూప్ డీ ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ భూములను లంచంగా తీసుకున్నారని అభియోగాలు ఉన్న సంగతి విదితమే.
ఆ కేసుకు సంబంధించి సీబీఐ బుధవారం ఆర్జేడీ ఎంపీ అహ్మద్ కరీం, ఎమ్మెల్సీ సునీల్ సింగ్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్ళలో సోదా నిర్వహించింది. అయితే ఈ దాడుల వెనుక ఉన్నది రాజకీయ కారణమేనని నితీష్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే లక్ష్యంతోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. ఇటువంటి దాడులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nitesh-wins-floor-test--39-142604.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.