కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్ జెట్ స్పీడ్తో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. కేసులు మాత్రం ఏ మాత్రం తగ్గేదే లే అన్న రీతిలో రోజురోజుకు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని.. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు సంక్రాంతి పండగ వస్తోంది. సంక్రాంతి అంటేనే సినిమా పండగా.. ఈ పండగ పురస్కరించుకుని చిన్న, పెద్ద కలిపి దాదాపు పది సినిమాలు విడుదల కానున్నాయి. ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ వంటి భారీ చిత్రాలు ఈ సమయంలో విడుదల కాకపోయినా.. సంక్రాంతి పండక్కి ఏదో ఒక సినిమా విడుదలవుతోందని సినీ అభిమానులు ఓ వైపు సంబరపడుతుంటే.. చిన్న సినిమాలకు సైతం ఛాన్స్ దొరికిందంటూ మరో వైపు నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కానీ పెరుగుతున్న కేసుల దృష్ట్యా త్వరలో ఆంధ్రప్రదేశ్లో రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జనవరి 10వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే.. సెకండ్ షోలు రద్దు అవుతాయని దీని వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయే అకావశం వుందని... టాలీవుడ్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక తెలంగాణలో లాక్డౌన్ ఉండదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశాలు కూడా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ ఏపీలో అలా కాదు.. ఇప్పటికే జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు తగ్గించింది.దాంతో రాష్ట్రంలోని చాలా థియేటర్లు మూసివేశారు. ఇక రాత్రి కర్ప్యూ కూడా పెడితే.. సంక్రాంతి పండగకు విడుదలయ్యే సినిమాల పరిస్థితి ఏమిటని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా పరిశ్రమ మూలుగుతోందని.. ఇక రాత్రి కర్ఫ్యూ కూడా పెడితే.. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా పరిస్థితి మారుతోందని టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/night-curfew-proposal-in-ap-from-jan-10th-39-129786.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.