పబ్లిక్ ప్రదేశాల్లో సామూహిక విషప్రయోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఐసిస్ అనుబంధ బయో టెర్రర్ కుట్ర కేసులో కీలక పరిణా మం చోటుచేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముగ్గురిపై అధికారికంగా చార్జ్షీట్ దాఖలు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో అనుబంధం కలిగిన ఈ నిందితులు జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సామూహిక విషప్రయోగం చేసి భయాన్ని వ్యాప్తి చేయాలని కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ కాగా, సహ నిందితులు ఉత్తర ప్రదేశ్ కు చెందినఆజాద్, మొహమ్మద్ సుహేల్ . వీరిపై యూఏపీఏ, బీఎన్ఎస్, ఆర్మ్స్ యాక్ట్కు సంబంధించిన పలు సెక్షన్ల కింద అహ్మదాబాద్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జ్షీట్ దాఖలైంది.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.
ఈ కేసును మొదటగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ) నమోదు చేసింది. నవంబర్ 2025లో టోల్ ప్లాజా వద్ద డాక్టర్ మొహియుద్దీన్ను అరెస్ట్ చేశారు. అతని కారులో అక్రమ ఆయుధాలు, నాలుగు లీటర్ల ఆముదం నూనె లభించాయి. అదే రోజు ఏటీఎస్ మిగతా ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేసింది.అధికారుల దర్యాప్తులో ఆజాద్, సుహేల్ హనుమాన్ ఘాట్ లోని డెడ్-డ్రాప్ సైట్ నుంచి డబ్బు పార్సిళ్లు, అక్రమ ఆయుధాలు సేకరించి వాటిని గుజరాత్లోని ఛత్రాల్ ప్రాంతంలో మొహియుద్దీన్కు అందేలా వదిలినట్లు వెల్లడైంది.
జనవరి 2026లో కేసు దర్యాప్తు చేపట్టి5న ఎన్ఐఏ కీలక విషయాలను బయటపెట్టింది. మొహియుద్దీన్ను అతని హ్యాండ్లర్ దక్షిణ ఆసియా ప్రాంతానికి ఐఎస్ అమీర్ గా చేస్తామని హామీ ఇచ్చి ఈ కుట్రలోకి దింపినట్లు తెలిసింది. మొహియుద్దీన్ తన హైదరాబాదు నివాసాన్ని ఆముదం విత్తనాల నుంచి రిసిన్ తయారీకి రహస్య ప్రయోగశాలగా మార్చినట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో ఇతర ఇద్దరు నిందితుల పాత్ర కూడా కీలకంగా బయటపడింది. వారు విదేశీ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు చేసినట్లు ఎన్ఐఏ తేల్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nia-charges-three-in-isislinked-bioterror-conspiracy-case-36-219035.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.