నెక్స్ట్ ఎవరు.. సీఎస్, డీజీపీయేనా? ఏపీ అధికారుల్లో చర్చ!

Publish Date:Apr 24, 2024

Advertisement

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. కోడ్ లెక్క చేయకుండా అధికార యంత్రాంగం అధికార పార్టీ సేవలో తరించిపోతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందన్న విమర్శలూ వెల్లువెత్తాయి. పశ్చిమబెంగాల్ లో అయితే ఇలా కోడ్ అమలులోకి వచ్చిందో లేదో అలా ఆ రాష్ట్ర పోలీస్ చీఫ్ కు స్థాన భ్రంశమైంది. అక్కడి కంటే అడ్డగోలుగా ఇక్కడ అధికార యంత్రాంగం జగన్ ప్రభుత్వ సేవలో  తరిస్తుంటే ఎన్నికల సంఘం ఉదాశీనంగా వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. 

అయితే ఆలస్యంగానైనా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీపై దృష్టి సారించింది. అధికార పార్టీకి అనుకూలంగా అంటకాగుతున్న అధికారులపై వేటు వేస్తోంది. తాజాగా ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతాపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.  ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పోస్టింగ్ ఇవ్వాలని విస్పష్టంగా ఆదేశించింది.   ఎన్డీఏ కూటమి చాలా రోజుల నుంచి  రాష్ట్ర ఇన్చార్జి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి, ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా తాతా సహా.. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ముగ్గురు డీఎస్పీలు, మరికొందరు పోలీసు అధికారులను, ఎన్నికల వరకూ ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఈసీకి ఫిర్యాదు చేసింది.

బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అయితే.. అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా వ్యవహరిస్తున్న అధికారుల జాబితాతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.   ముఖ్యంగా సీఎస్ జవహర్‌రెడ్డి పెన్షన్ల విషయంలో  ఈసీ ఆదేశాలు ఉల్లంఘించి జగన్ పార్టీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఇక ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేసింది. అయితే విచిత్రంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉన్న సీఎస్ జవహర్‌రెడ్డి, ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని తొలగించకుండా..  ఇంటలిజన్స్ చీఫ్‌ను తప్పించడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. దేశంలో ఇఫ్పటివరకూ ఇన్ చార్జ్ డీజీపీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగిన సందర్భం లేదు. పశ్చిమ బెంగాల్ లో పూర్తి స్థాయి డీజీపీనే కోడ్ అమలులోకి వచ్చీరాగానే తప్పించిన ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇన్ చార్జ్ డీజీపీని ఇంత వరకూ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు ఇవ్వకపోవడంపై రాజకీయ పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా ఇన్ చార్జి డీజీపీ విషయంలో  ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎన్నికల సంఘం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సీఎస్ గా కాకుండా, అధికార పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ జవహర్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇన్ చార్జ్ డీజీపీ కంటే ముందు ఆయనపై ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉందనీ, ఆ తరువాత కొత్తగా వచ్చే సీఎస్ డీజీపీ విషయంలో నిర్ణయం తీసుకుంటారన్న వాదన అధికారవర్గాల్లో వినవస్తోంది. సీఎస్, ఇన్ చార్జ్ డీజీపీల మార్పు అయితే ఖాయమని అంటున్నారు.  ఇహనో, ఇప్పుడో లేదా నేడో రేపో అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని అంచనా వేస్తున్నారు.

అది పక్కన పెడితే తాజాగా ఇద్దరు కీలక ఐపిఎస్ అధికారులపై బదిలీ వేటుతో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులలో ఆందోళన మొదలైంది.  ఇప్పటికే ఎన్డీఏ నేతల ఫిర్యాదులు ఎదుర్కొంటున్న ఈ స్థాయి అధికారులలో కంగారు మొదలైంది. అధికార పార్టీకి అనుకూలంగా ఎంతగా సేవ చేసినా ఎన్నికల సమయంలో ఈసీ కొరడా ఝుళిపించకుండా తమను అధికార పార్టీ నేతలు కానీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ కాపాడలేరన్న విషయం ఇప్పుడు వారికి అర్థమైనట్లు కనిపిస్తోంది. ఇక నుంచి తటస్థంగా ఉండాలని వారు భావించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.  ఉల్లంఘనులపై ఈసీ విడతల వారీ వేటు వెనుక కూడా ఇదే ఉద్దేశధం ఉండి ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై ఎన్నికల సంఘం వేటు ఏపీ అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తరువాత వంతు ఎవరిదో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
ఏపీ ఇన్‌ఛార్జ్ డీజీపీగా శంఖబ్రతా బాగ్చి నియమితులయ్యారు. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి డీజీపీని నియమించేవరకు బాగ్చి డీజీపీ
చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (మే6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
డాక్టర్ గౌతమ్ అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ వెంకట మనోజ్ఞకు భర్త. ఈ మేరకు ఆయన ఆదివారం నాడు ఒక షాకింగ్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన... ‘‘నాపేరు డాక్టర్ గౌత్. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే, మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుడిని.....
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.