స్పీడ్ న్యూస్ -1
Publish Date:Jul 5, 2023
Advertisement
1.తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు-సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భేటీపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భరతం పట్టేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని, ఈ నేపథ్యంలో కూటమిలో చీలిక తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2.ఢిల్లీలో జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. 3.సోషల్ మీడియాలో ఎవరికి వారే పోస్టులు పెడుతున్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మద్దతుగా బీజేపీ క్యాడర్ పోస్టులు పెడుతోంది. బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించటాన్ని ఈ వర్గం తప్పు పడుతోంది.ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి రావటంతో.. సోషల్ మీడియాలో ఈటల వర్గం సంబరాలు చేసుకుంటోంది. కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్గం మాత్రం సైలెంట్గా ఉంది. 4. ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సెటైర్ విసిరారు. విజయవాడలో నేడు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హాస్య ప్రదర్శన... ప్రవేశం ఉచితం... ఆసక్తి కలిగిన వారు తిలకించవచ్చు అంటూ ఎద్దేవా చేశారు. 5.తెలంగాణలో త్వరలోనే గ్రూప్4 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. 6. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ను మార్చి కిషన్రెడ్డిని నియమించడం పట్ల టీపీసీసీ అలర్ట్ అయింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోరిక మేరకే కిషన్రెడ్డిని నియమించారని ఆరోపిస్తూనే బీసీ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. 7. నాలుగేళ్ల పాటు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి విసిగిపోయాను’అని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. 8.మహారాష్ట్రలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవవార్తోపాటు బీజేపీలోకి ఫిరాయించిన ఆయన సోదరుడి కుమారుడు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గం బుధవారం పోటాపోటీగా వేర్వేరుగా సమావేశం అవుతోంది. శరద్ పవర్ వర్గం దక్షిణ ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం అయ్యింది. అజిత్ వర్గం బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఉదయం 11 గంటలకు సమావేశం అయ్యింది. 9.పెళ్లి వేడుకలో వధువు తల్లి సిగరెట్ కాల్చడం చూసిన వరుడు తనకు పెళ్లి వద్దంటూ మొండికేశాడు. వివాహ వేదిక నుంచి వెళ్లిపోయాడు. యూపీలోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10.దురదృష్టమంటే జింబాబ్వేదే. ప్రపంచకప్లో చోటు ఖాయమని భావించిన వేళ చివరి మెట్టుపై ఓ అనామక జట్టుపై పరాజయం పాలై అనూహ్యంగా ప్రపంచకప్కు దూరమైంది. క్వాలిఫయర్స్లో చితక్కొట్టేస్తున్న స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ ఇప్పటికే నిష్క్రమించగా ఇప్పుడు జింబాబ్వేలోని బులవాయోలో జరిగిన మ్యాచ్లో వరుసగా రెండోసారి కూడా దూరమైంది. ఏమాత్రం ఊహించని ఈ పరిణామంతో జింబాబ్వే ఆటగాళ్లు కంటతడి పెట్టుకున్నారు.
http://www.teluguone.com/news/content/news-in-brief-39-157863.html





