అడకత్తెరలో పోకచెక్కలా కేసీఆర్ పరిస్థితి!

Publish Date:May 26, 2023

Advertisement

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంగా మొదలైన వివాదం, రాజకీయ దుమారంగా మారింది. పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించడం సముచితంగా ఉంటుందని, రాజ్యాంగాన్ని ఉటంకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించడం రాష్ట్రపతిని అవమానించడమే అని అరొపిస్తున్నాయి. 

అంతే కాదు, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే, ఆ గౌరవం ప్రధాని మోడీకి ఎట్టి పరిస్థితుల్లో దకక్కుండా అడ్డుకునేందుకు విపక్షపార్టీలన్నీ ఏకమయ్యాయి. ఒకటి  కాదు, రెండు కాదు ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంట్ భవన సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభ వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించాయి. మరో అడుగు ముందుకేసి ప్రదాని మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ భవనం ప్రారంభం కాకుండా అడ్డుకునేదుకు న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. సరే, చివరకు న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది ఏమిటి అనే విషయాన్ని పక్కన పెడితే, విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం జరగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. 

నిజానికి, ప్రారంభ వేడుకలనే కాదు, పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తోంది. పార్లమెంట్ భవన శంకు స్థాపన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అప్పటి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్ కారణంగా చూపించి, పార్లమెంట్ నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర నాయకులు అనేక సందర్భాలలో అసలే దేశం క్లిష్ట పరిస్థితిల్లో  ఉందని అంటూ  ఇప్పడు నూతన పార్లమెంట్ భవనం  అవసరమా అని ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే, విపక్షాలు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకున్న విధంగా పార్లమెంట్ నిర్మాణ పనులను కొనసాగించింది. అనుకున్న విధంగానే నిర్మాణం పూర్తిచేసింది. ఈనెల (మే) 28 న ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ దశలో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి గౌరవాన్ని అస్త్రంగా చేసుకుని వేడుకను వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నది.

అయితే.. పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన భవనాలను ప్రధానమంత్రి టెంకాయ కొట్టడం ఇదే తొలిసారి కాదని అధికార బీజేపీ నాయకులు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషీ ఇతర మంత్రులు గుర్తుచేస్తున్నారు. గతంలో 1975లో  పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఆతర్వాత 1980లలో అదే పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రారంభించారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. 

అదలా ఉంటే, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా పార్లమెంట్ నితన భవనాలను ప్రధానమంత్రి ప్రారంభించడాన్ని తప్పు పడుతూ విపక్షాలు చేస్తున్న ఆందోళన, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్ని పరీక్షగా మారింది. ఒక విధంగా 2024 ఎన్నికల్లో మోడీ ఓడించేందుకు ఏకమవుతున్న విపక్షాలు  పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరు కావడం అంటే, అది దేశ ద్రోహం కంటే మహాపరాధం అన్నట్లుగా, మోడీ వ్యతిరేకతకు లిట్మస్ టెస్ట్’గా భావిస్తున్నాయి. అటో ఇటో తేల్చుకోమని బీఆరేఎస్ వంటి బీజేపీ వ్యతిరేక పార్టీలకు సవాలు విసురుతున్నాయి. నిజానికి  ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు సాగిస్తున్న నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఎవరూ బీఆర్ఎస్ పార్టీని, కేసేఆర్ ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దూరం ఉంచుతున్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్ .. సుమోటోగా  పార్లమెంట్ భవన ప్రరంభోత్సవ వేడులకలను  భాహిష్కరించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకో వచ్చు. కానీ తెలంగాణ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ పిలవక పోవడంతో, ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక న్యూట్రల్ గా మిగిలి పోయారు. 

అదలా ఉంటే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఇదే అదనుగా కేసీఆర్ కు చురక అంటించారు. పార్లమెంటును ప్రధాని మోడీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె, తెలంగాణ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తెలిపారు. దీంతో తెలంగాణ సర్కార్ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిపోయింది.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.