అడకత్తెరలో పోకచెక్కలా కేసీఆర్ పరిస్థితి!

Publish Date:May 26, 2023

Advertisement

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంగా మొదలైన వివాదం, రాజకీయ దుమారంగా మారింది. పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించడం సముచితంగా ఉంటుందని, రాజ్యాంగాన్ని ఉటంకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించడం రాష్ట్రపతిని అవమానించడమే అని అరొపిస్తున్నాయి. 

అంతే కాదు, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే, ఆ గౌరవం ప్రధాని మోడీకి ఎట్టి పరిస్థితుల్లో దకక్కుండా అడ్డుకునేందుకు విపక్షపార్టీలన్నీ ఏకమయ్యాయి. ఒకటి  కాదు, రెండు కాదు ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంట్ భవన సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభ వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించాయి. మరో అడుగు ముందుకేసి ప్రదాని మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ భవనం ప్రారంభం కాకుండా అడ్డుకునేదుకు న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. సరే, చివరకు న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది ఏమిటి అనే విషయాన్ని పక్కన పెడితే, విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం జరగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. 

నిజానికి, ప్రారంభ వేడుకలనే కాదు, పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తోంది. పార్లమెంట్ భవన శంకు స్థాపన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అప్పటి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్ కారణంగా చూపించి, పార్లమెంట్ నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర నాయకులు అనేక సందర్భాలలో అసలే దేశం క్లిష్ట పరిస్థితిల్లో  ఉందని అంటూ  ఇప్పడు నూతన పార్లమెంట్ భవనం  అవసరమా అని ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే, విపక్షాలు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకున్న విధంగా పార్లమెంట్ నిర్మాణ పనులను కొనసాగించింది. అనుకున్న విధంగానే నిర్మాణం పూర్తిచేసింది. ఈనెల (మే) 28 న ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ దశలో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి గౌరవాన్ని అస్త్రంగా చేసుకుని వేడుకను వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నది.

అయితే.. పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన భవనాలను ప్రధానమంత్రి టెంకాయ కొట్టడం ఇదే తొలిసారి కాదని అధికార బీజేపీ నాయకులు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషీ ఇతర మంత్రులు గుర్తుచేస్తున్నారు. గతంలో 1975లో  పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఆతర్వాత 1980లలో అదే పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రారంభించారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. 

అదలా ఉంటే, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా పార్లమెంట్ నితన భవనాలను ప్రధానమంత్రి ప్రారంభించడాన్ని తప్పు పడుతూ విపక్షాలు చేస్తున్న ఆందోళన, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్ని పరీక్షగా మారింది. ఒక విధంగా 2024 ఎన్నికల్లో మోడీ ఓడించేందుకు ఏకమవుతున్న విపక్షాలు  పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరు కావడం అంటే, అది దేశ ద్రోహం కంటే మహాపరాధం అన్నట్లుగా, మోడీ వ్యతిరేకతకు లిట్మస్ టెస్ట్’గా భావిస్తున్నాయి. అటో ఇటో తేల్చుకోమని బీఆరేఎస్ వంటి బీజేపీ వ్యతిరేక పార్టీలకు సవాలు విసురుతున్నాయి. నిజానికి  ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు సాగిస్తున్న నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఎవరూ బీఆర్ఎస్ పార్టీని, కేసేఆర్ ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దూరం ఉంచుతున్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్ .. సుమోటోగా  పార్లమెంట్ భవన ప్రరంభోత్సవ వేడులకలను  భాహిష్కరించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకో వచ్చు. కానీ తెలంగాణ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ పిలవక పోవడంతో, ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక న్యూట్రల్ గా మిగిలి పోయారు. 

అదలా ఉంటే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఇదే అదనుగా కేసీఆర్ కు చురక అంటించారు. పార్లమెంటును ప్రధాని మోడీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె, తెలంగాణ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తెలిపారు. దీంతో తెలంగాణ సర్కార్ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిపోయింది.

By
en-us Political News

  
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.