వారసత్వ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త మార్గదర్శకాలు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Publish Date:Mar 26, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్‌కు చిక్కుముడులు వీడాయి. వారసత్వంగా వచ్చిన వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.  అటువంటి స్థలాల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేలా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి.   ఇకపై ఈ స్థలాల రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ అవసరం లేదు. ఆ స్థల యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. వ్యసాయేతర  స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ ఇక తప్పని సరి కాదు.  స్థలం యజమానుల సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలను అమలు అవుతాయి. 

చాలామందికి వారసత్వంగా పూర్వీకుల నుంచి వ్యవసాయేత భూములు వచ్చాయి. అయితే ఈ భూములను  రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవసరమైన హక్కుకు సంబంధించి వీరి వద్ద ఆధారాలు లేవు. అంటే క్రయ, విక్రయ హక్కు భుక్తాదులకు సంబంధించి వీరు చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి చిక్కులకు పరిష్కారంగా  ఇంత వరకూ రెవెన్యూ అధికారుల నుంచి యాజమాన్య  పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరిగేవి.  అయితే రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవడంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఇబ్బందులకు పరిష్కారంగా వివాదాల కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది.    పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయేతర స్థలాల  రిజిస్ట్రేషన్‌ సమయంలో  ఈ ఆస్తి వారసత్వంగా వచ్చిందనీ, ఇతరులకు హక్కు లేదని, ఈ భూములు నిషేధిత జాబితా  లో లేదని కచ్చితంగా డాక్యుమెంట్‌లో స్పష్టంగా ప్రస్తావించాలి. రిజిస్ట్రేషన్ చేయబోయే స్థలానికి పూర్తి హక్కుదారు తామేనని సెల్ఫ్ డిక్లరేషన్‌  ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ  తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం  ఆ మార్గదర్శకాలలో స్పష్టంగా పేర్కొంది.  అలాగే రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్‌ ఆధారంగా బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ కుటుంబ వివాదాలు, ప్రభుత్వ భూమి అనే అనుమానాలు వస్తే  ఆ భూమి రిజిస్ట్రేషన్‌ నిలిపిసే అధకారం అధికారులకు ఉంటుంది.    

By
en-us Political News

  
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ సతీమణి..!
రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి భారత షట్లర్‌గా ఘనత..!
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.