ఏపీలో కరోనా కొత్త వేరియంట్..మళ్లీ క్వారంటైన్ లు, ఐసోలేషన్ లు తప్పవా?

Publish Date:Jul 21, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ మరో సారి కరోనా ఇసోలేషన్ లు, క్వారంటైన్ ల భయాన్ని తీసుకువస్తున్నది. ఇప్పుడు ఏపీలో వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కరోనా కొత్త వేరియంట్ గా నిర్థారించారు.   ఇటీవల కడప జిల్లాతో పాటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో కోవిడ్ సోకిన బాధితుల నుంచి సేకరించిన  బాధితుల నమూనాలను పూణేలోని  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఎన్ఐవీ పరిశోధన కేంద్రంలో  నిర్వహించిన అధునాతన జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణలో బాధితులకు  ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5   అనే నూతన వేరియంట్ సోకినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. గతంలో కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం, తీవ్ర భయాందోళనలు ప్రజల మనస్సుల్లో ఇంకా సజీవంగానే ఉండటంతో ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ కొత్త కరోనా వేరియంట్ పెద్ద ప్రమాదకరమనది కాదని స్పష్టం చేసింది.  

రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఉనికి అధికారికంగా వెలుగుచూసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితుల నమూనాల ఫలితాల నివేదిక అందగానే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో   సమీక్ష నిర్వహించారు.  వర్చువల్ సమావేశాల ద్వారా వైద్యాధికారులతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల నమోదు వేగం, ప్రస్తుతం ప్రభుత్వ,  ప్రైవేట్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, ఆక్సిజన్ నిల్వలు,  ముందస్తు జాగ్రత్త చర్యలపై సమగ్ర నివేదిక తీసుకున్నారు.  

 ప్రస్తుతం రాష్ట్రంలో వెలుగు చూసిన ఆర్‌ఎఫ్.5 వేరియంట్ ప్రమాదకరమైనది కాదని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇది  సాధారణ సీజనల్ కొవిడ్ ఇన్ఫెక్షన్ తెచ్చే వేరియంట్‌ అని చెబుతున్నారు. కోవిడ్ సోకిన వారిలో  తీవ్రమైన గొంతు నొప్పి, పొడి దగ్గు,   జ్వరం, తలనొప్పి, జలుబు, అలసట ఉంటాయనీ, అలాగే..   కండరాల నొప్పులు కూడా ఉంటాయని వైద్యులు తెలిపారు. 

Covid New Variant RF5,  Omicron Sub Variant AP, Kadapa Covid Samples,  Pune NIV, Health Minister Satya Kumar Yadav Review 

By
en-us Political News

  
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.