పోసాని కూడా అందగాడేనా జగనూ?.. ఒక రేంజ్లో ట్రోల్ అవుతున్న మాజీ సీఎం

Publish Date:Feb 28, 2025

Advertisement

విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు రోజులు గుడుస్తున్నా ఇంకా ట్రోల్ అవుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా వైసీపీలోని కమ్మ నేతల అందం గురించి మాట్లాడిన జగన్ ఒక రేంజ్లో ట్రోల్ అవుతున్నారు.. ఆ ఎఫెక్ట్‌తో ఆయన తీరు వైసీపీ నేత‌ల‌కు, కార్యక‌ర్తలకే అంతుప‌ట్టడం లేదంట.  వాస్తవానికి జగన్‌కి ఉన్నంత ఇగో ఫీలింగ్, డామినేషన్ నేచర్ ఇంకే పొలిటీషియన్‌కి ఉండవన్న అభిప్రాయం ఉంది. ఓట్ల వర్షం కురవడానికి తన ఫొటో ఉంటే చాలు ఇంకెవరూ అక్కర్లేదన్నట్లు ఆయన వ్యవహార తీరు ఉండేది.
వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వ్యవహరించారు అనడానికి  పలు ఉదంతాలు ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు జగన్ ఉన్న వేదిక మీదే అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా ఉన్నారు. బడా ఇండస్ర్టియలిస్ట్ అయిన ఎస్పీవై రెడ్డి ఆజానుబాహుడు. వైట్ అండ్ వైట్ డ్రస్‌లో హుందాగా కనిపించే వారు. ఆయన వేదికపై జగన్ పక్కన నుంచోవడంతో సహజంగానే జగన్ కాస్తంత పొట్టిగా కనిపించి ఫిజికల్‌గా తేలిపోయారంట. దాంతో జగన్ వెంటనే అన్నా నువ్వు డయాస్ దిగు అని ఆ పెద్దాయన్ని వేదిక మీద నుంచి దింపే శారంట. ఈ ఉదంతాన్ని వైసీపీ సీనియర్లు, నంద్యాల నేతలు ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటారు.

అప్పట్లో సీని నటులు జీవితా, రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరి జగన్ కోసం ప్రచారం చేశారు. జగన్‌తో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు. అయితే రాజశేఖర్ తనదైన కాస్ట్యూమ్స్, మేకప్‌తో  వేదికపై తనను డామినేట్ చేస్తున్నారని జగన్ ఆ దంపతులను దూరం పెట్టేశారన్న ప్రచారం గట్టిగానే జరిగింది. రోజాకు కూడా అధికారిక కార్యక్రమాలకు మేకప్‌తో రావొద్దని వార్నింగ్ ఇవ్వడం వల్లే ఆమె అసెంబ్లీలో, పార్టీ కార్యక్రమాల్లో ఒరిజినల్ గెటప్‌తో కనిపించారంట

అట్లాంటి జగన్ అధికారం చేజారగానే తన ఇగోలు, డామినేషన్‌లు పక్కన పెట్టి కొత్త రాగం ఎత్తుకుంటూ అభాసుపాలవుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో సహా దొరికిపోయి బెజవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చిన జగన్.. ఆ పరామర్శ పూర్తయ్యాక జైలు ముందే మీడియా ముందుకొచ్చారు .. చంద్రబాబు  తన కుటుంబం తప్ప కమ్మ సామాజిక వ‌ర్గంలో ఎవ‌ర్నీ పైకిరానివ్వరు.. అందుకే  రాజ‌కీయంగా ఎదుగుతున్న కొడాలి నాని, వ‌ల్ల‌భనేని వంశీ, దేవినేని అవినాశ్ ల‌పై క‌క్షపూరితంగా వ్యవ‌హ‌రిస్తున్నారని సరికొత్త రాగం ఎత్తుకున్నారు.

అంతవరకు ఓకే కాని జగన్ తన స్థాయిని కూడా మర్చిపోయినట్లు స్క్రిప్ట్‌లో రాసిచ్చిన డైలాగులు వల్లె వేసి అభాసుపాలయ్యారు. తన పార్టీ నేతల గ్లామర్ గురించి మాట్లాడిన జగన్ వాళ్లు అందగాళ్లని కితాబిచ్చారు.  చంద్రబాబు, లోకేశ్ కంటే వ‌ల్లభ‌నేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాశ్ లు అందంగా ఉంటార‌ట‌. తమ సామాజికవర్గానికి చెందిన అలాంటి వాళ్ల రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్వలేకే  చంద్రబాబు అక్రమ కేసులు పెట్టిస్తున్నారంట ... అందులో భాగంగానే క‌క్షపూరితంగా వ‌ల్లభ‌నేని వంశీపై అక్రమ‌ కేసులు పెట్టార‌ట‌.. కొడాలి నాని, అవినాశ్ కూడా గ్లామర్‌గా ఉండ‌టంతో వారినీ త్వర‌లోనే కేసుల్లో ఇరికిస్తారని జగన్ జోస్యం చెప్పేశారు.

అరెస్టుల పర్వంలో జగన్ లెక్కలు తప్పి ఇప్పుడు పోసాని కృష్ణమురళీ వంతు వచ్చింది. ఫోన్లో పోసాని భార్యను పరామర్శించి ధైర్యం చెప్పిన జగన్.. ఆ కేసు చూసుకోవడానికి తన న్యాయకోవిదుల్ని కూడా నియమించారు. అంతవరకు బానే ఉన్నా పోసాని గ్లామర్‌ను జగన్ ఎవరితో పోలుస్తారో అన్న సెటైర్లు మొదలయ్యాయి. పోసాని కూడా లోకేష్ కంటే అందగాడని అందుకే అరెస్ట్ చేశారని జగన్ ఎక్కడ స్టేట్‌మెంట్ ఇస్తారో? అని వైసీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నాయంట.  అయినా మగవాళ్ల అందం గురించి అందునా రాజకీయ నాయకుల అందం గురించి మాజీ సీఎం  జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం ఏంటో అర్ధం కావటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బహుశా అలాంటి వ్యాఖ్యలు చేసిన మొదటి, ఆఖరి మాజీ ముఖ్యమంత్రి జగనేనేమో.

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.