Publish Date:Jan 31, 2025
రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారన్నది నానుడి. ప్రస్తుతం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను చూస్తుంటే నీరో చాలా చాలా నయం అనిపిస్తుంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అధికారంలో ఉండగా తమంత వారు లేరన్నట్లుగా చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు నోరు మెదపడానికి భయంతో వణికి పోతున్నారు. చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు. ఇక ఎక్కడా అవకాశం లేని కొద్ది మంది మాత్రం త్వమేవ శరణం నాస్తి అన్నట్లు వైసీపీపి పట్టుకు వేళాడుతున్నారు. వారిలో కూడా అంబటి వంటి వారు తప్ప మరెవరూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. సాధ్యమైనంత వరకూ వార్తల్లో ఉండకుండా కౌపీన సంరక్షణార్థం అన్నట్లు మౌనాన్ని ఆశ్రయించి దాదాపు రహస్య జీవనం గడుపుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో జగన్ కుమార్తెల దగ్గరకు అంటూ లండన్ చెక్కేశారు. సంక్రాంతి తరువాత నుంచీ జిల్లాల పర్యటన అంటూ ఊదరగొట్టేసిన ఆయన ఆ తరువాత ఆ మాటే ఎత్తడం లేదు. సరే అది అలా ఉంచితే తాజాగా వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించి, జగన్ తన బలుపుగా ఇంత కాలం చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి జగన్ కు షాక్ ఇచ్చారు. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా చడీచప్పుడు లేకుండా విజయసాయి తన దారి తాను చూసుకున్నారు. ఇక రాజకీయాలు మాట్లాడనుంటూ ట్వీట్ చేసేసి పనిలో పనిగా ఇంత కాలం తాను ఎవరిపై అయితే అనుచిత వ్యాఖ్యలు, అసంబద్ధ విమర్శలతో రెచ్చిపోయారో వారి పట్ల తనకు ఎలాంటి విరోధం లేదని కూడా చెప్పేసి తాను గతంలో చేసిన విమర్శలు, వ్యాఖ్యలూ అన్ని జగన్ స్క్రిప్టేనని అన్యాపదేశంలో వెల్లడించేశారు. ఎదో మొక్కిబడికి జగన్ కు తాను రుణపడి ఉంటానని, వైఎస్ కుటుంబంతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇదంతా సరే విజయసాయి రాజీనామాతో వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. అసలు ఎవరూ ఊహించని పరిణామం కావడంతో విజయసాయి రాజీనామాపై ఎలా స్పందించాలో కూడా ఆ పార్టీ నేతలకు తెలియలేదు. అందుకే విజయసాయి పార్టీ నుంచి నిష్క్రమించడంపై వైసీపీ నుంచి అధికారిక స్పందనే కరవైంది. సజ్జల, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు పెదవి కదపలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. సాధారణంగా పార్టీ ఇంతటి సంక్షోభంలో ఉన్న తరుణంలో ఏ నాయకుడైనా పార్టీ నేతలు, క్యాడర్ లో ధైర్యం నింపడానికి వారితో భేటీ అవుతారు. భరోసా ఇస్తారు. నేను ముందుండి నడిపిస్తానన్న స్థైర్యాన్ని ఇస్తారు. కానీ జగన్ అవేమీ చేయలేదు. విదేశీ పర్యటన నుంచి ఆయన ఏపీకి రాలేదు. బేంగళూరు వెళ్లి కూర్చున్నారు.
పార్టీ పరిస్థితి గురించి కానీ, విజయసాయి రాజీనామా గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు. విదేశీ విహారం తరువాత బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు సైతం జగన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ మనుడగ కష్టమేనన్న అభిప్రాయం ఆ పార్టీ నుంచే వ్యక్తం అవుతోంది. ఇంకా జగన్ ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని బాహాటంగానే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన రాష్ట్రానికి వచ్చి జిల్లాల పర్యటనలు ప్రారంభించినా ఆయన వెంట నడిచేవారూ, నిలిచేవారు ఎవరూ ఉండకపోవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/neero-far-better-than-jagan-39-192151.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.